రౌడీ
హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం మీకు మాత్రమే చెప్తా.
తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన ఈ
సినిమా ఈమధ్య రిలీజై మణి మౌత్ టాక్ సంపాదించింది. ఈ
సినిమా కంటెంట్ ఓకే కాని ప్రొడక్షన్ వాల్యూస్ బాగా లేవన్న టాక్ వచ్చింది. అయితే సినిమాకు బాగానే ఖర్చు చేశాం కాని పోస్ట్ ప్రొడక్షన్ సరిగా రాలేదని అంటున్నారు నిర్మాతల్లో ఒకరైన వర్ధన్ దేవరకొండ.
విజయ్ బ్రాండింగ్ తో
సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చినా తన సంపాదనలో 70 శాతం ఈ
సినిమా ప్రొడక్షన్ కు పెట్టేశా అని చెప్పడంతో భారీగానే ఖర్చు పెట్టి ఉంటాడని ఆశించారు. తీరా
సినిమా చూస్తే
విజయ్ చెప్పినట్టుగా ఏం ఖర్చు కనబడలేదు. అయితే సినిమాలో ఎక్కువ సీన్స్ నైట్ ఎఫెక్ట్ ఉండటం వల్ల సరిగా రాలేదని.
మీకు మాత్రమే చెప్తా సినిమాకు 5 కోట్లు బడ్జెట్ అయ్యిందని అన్నారు వర్ధన్ దేవరకొండ. అయితే
విజయ్ తండ్రి వర్ధన్ చెప్పినట్టుగా
మీకు మాత్రమే చెప్తా సినిమాకు 5 కోట్లు ఖర్చు పెట్టారనే అనుకున్నా ఆ 5 కోట్ల క్వాలిటీ మాత్రం రాలేదని చెప్పొచ్చు. ఇక
సినిమా కామెడీ పరంగా బాగున్నా వసూళ్ల మీద ఆ ప్రభావం చూపించలేదు.