తమిళ యంగ్ హీరో కార్తి  నటించిన  లేటెస్ట్ మూవీ ఖైదీ మంచి అంచనాల మధ్య దీపావళి కానుకగా విడుదలై  కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బిగ్గెస్ట్  బ్లాక్ బాస్టర్ దిశగా పయనిస్తుంది.  సూపర్ పాజిటివ్  రివ్యూస్  కు తోడు  ఎక్స్ట్రాడినరీ  టాక్ తో   రెండో వారం లో  కూడా బాక్సాఫీస్ వద్ద  స్టెడీగా  కలెక్షన్లను రాబడుతుంది . తెలుగు లో  అయితే   కేవలం 30లక్షల షేర్ తో పూర్ ఓపెనింగ్ న రాబట్టిన ఈ చిత్రం  ఆతరువాత  అనూహ్యంగా  పుంజుకొని    అన్ని ఏరియాల్లో  బ్రేక్ ఈవెన్ అయ్యి  బయ్యర్లను లాభాల్లో  ముంచెత్తుతుంది. 11రోజుల్లో  ఖైదీ   తెలుగు రాష్ట్రాల్లో  5కోట్లకు పైగా  షేర్ ను రాబట్టిందని సమాచారం. ఫుల్ రన్ లో ఈ చిత్రం మరో  కోటి రూపాయల షేర్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో ఈచిత్రం తెలుగులో   కార్తి కెరీర్ లోనే  బిగ్గెస్ట్  హిట్  గా  రికార్డు సృష్టించనుంది. 




ఇక  గత రెండు సినిమాలతో   నిరాశపరిచిన  కార్తి తాజాగా ఖైదీ సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.  ఈ సినిమాకు వస్తున్న  రెస్పాన్స్ తో కార్తి నటించిన  తదుపరి చిత్రాలకు  తెలుగులో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని  డ్రీం వారియర్ పిక్చర్స్  పతాకం పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించగా  సామ్ సీఎస్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.  తెలుగు లో ఈ చిత్రాన్ని  శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ విడుదలచేశారు. ఈచిత్రానికి  సీక్వెల్ కూడా రానుందని  ఇటీవల కార్తి మీడియా సమావేశం లో వెల్లడించిన విషయం తెలిసిందే. అన్ని కుదిరితే  వచ్చే ఏడాది  ఖైదీ 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: