చుంకీ పాండే కూతురైన అనన్య పాండే తన మొట్ట మొదటి సినిమా తోనే దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ధర్మ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన 'ది స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2' లో టైగర్ షరాఫ్ సరసన నటించిన ఈ 21 ఏళ్ళ భామ కీ సినీ అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. అటు వెండి తెరతో పాటు ఇటు సామిజిక మాధ్యమాలలో బాగా ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులని ఫుల్ ఎంటర్టెన్ చేస్తుంది ఈ బాలీవుడ్ తార. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఫిట్నెస్ ఫొటోస్ ని తరచుగా అప్లోడ్ చేసి ఫిట్నెస్ గోల్స్ ని పెంచుతుంది. 


ప్రస్తుతం ఆమె 'పతి పత్ని ఔర్ వహ్' షూటింగ్ పూర్తి చేసి ఆ సినిమా విడుదలకై వేచి చూస్తుంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఎపుడూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ తన సినిమాల గురించి తన ఫాలోయర్స్ తో పంచుకొనే ఈ క్యూటీ నిన్న కూడా అలానే తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ గురించి తెలియచేసింది. అదేంటంటే....  ఫిలింమేకర్ కొరియోగ్రాఫర్ అయినా ఫరాహ్ ఖాన్ తీస్తున్న నెక్స్ట్ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తెలియచేసింది. ఫరాహ్ ఖాన్ యొక్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ ని షేర్ చేస్తూ.... అనన్య పాండే ఇలా రాసింది... "వి లవ్ యు!!!.. మై నెక్స్ట్ డైరెక్టర్. "


ఈ విషయం తెలుసుకున్న తన అభిమానులు ఎంతో ఎక్సైట్ అవుతున్నారు. ఇంకా ఆఫిసిఅల్ కన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ అనన్య పాండే ఫరాహ్ ఖాన్ తో సినిమా చేయబోతోందనే విషయం చాలా ఆసక్తినిరేపుతోంది. ఇక తన రాబోయే ఇతర సినిమా గురించి చెప్పాలంటే.... అబ్బాస్ జాదర్ జీ స్టూడియోస్ నిర్మాణంలో మఖ్బూల్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరో ఇషాన్ ఖట్టర్ తో జత కట్టనుంది ఈ యంగ్ హీరోయిన్.


మరింత సమాచారం తెలుసుకోండి: