నిరంతరం వివాదాలతో వార్తల్లో నిలుస్తూ సినిమాలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా పొలిటికల్ కి సంభందించిన కాంట్రవర్సియల్ సినిమాలు చేస్తున్నాడు. ఎపిలో ఎన్నికలకు ముందు "లక్ష్మీస్ ఎన్టీఆర్" టైటిల్ తో సినిమా చేసినా రామ్ గోపాల వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అన్నే సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ పై తాజా గా గీత రచయిత జోన్న విత్తుల రామలింగేశ్వరరావు షాకింగ్ కామెంట్లు చేశారు. వివరాల్లో కి వెళ్తే గతంలో రామ్ గోపాల్ వర్మ...జోన్న విత్తుల రామలింగేశ్వరరావు గురించి వెటకారంగా మాట్లాడటం జరిగింది. దీంతో రాంగోపాల్ వర్మ కి కౌంటర్ గా జోన్న విత్తుల రామలింగేశ్వరరావు అదే స్థాయిలో స్పందించారు. ఎంతో మంది బయోపిక్ నుండి తీసిన రామ్ గోపాల్ వర్మ బయోపిక్ చేస్తానంటూ అన్నట్టుగా జోన్న విత్తుల రామలింగేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.


ఆయన ఏమన్నారంటే.. `"నేను నా పని నేను చేసుకుంటుంటే వర్మ వేలు పెట్టి మరీ కెలికాడు. నాపై లేనిపోని మాటలేంటి? అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు పప్పువి. బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నావ్. నీకంటే అంతర్జాతీయ పప్పు ఎవడూ లేడిక్కడ. అందుకే పప్పు వర్మ టైటిల్ తో నీపై నేను సినిమా చేయబోతున్నారు. రెడీగా ఉండు`` అంటూ జొన్నవిత్తుల డైరెక్టుగా ఆర్జీవీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


"ఇష్టానుసారం మాట్లాడటం మనిషి లక్షణం కాదు. నీ బ్రతుకేంట"  నువ్వు చూసుక'. మళ్లీచెబుతున్నా. పప్పు వర్మ తప్పెంటో తెలుసుకోవాలి. కాకినాడ వెళ్లి ఆయన కాళ్ల మీద పడాలి. నువ్వు ఎవర్ని అన్నావో ఆయన కాళ్లపైనా. లేదా నిను ఏం చేయాలే అదే చేస్తా. జైలుకు పంపుతా`` అంటూ జోన్న విత్తుల హెచ్చరించారు. దీంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రామ్ గోపాల్ వర్మ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: