ఈ మద్య క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి.  కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి  ‘రాగల 24 గంటల్లో’ లాంటి థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీరామ్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.  తాజాగా  ‘రాగల 24 గంటల్లో’ కి సంబంధించిన ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..సద్యదేవ్  నా లైఫ్ లో ఏదైనా అదృష్టం ఉందంటే.. అది మనం పెళ్లి చేసుకోవడమే’  ఈషాతో సత్యదేవ్ చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ మూవీమర్డర్ చుట్టు తిరుగుతుంది.  

హత్య ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా..నా భర్తను నేనే చంపేశానంటూ ఈషా పోలీసులతో చెప్పే మాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  వివాహం చేసుకుని ఆనందంగా గడపాల్సిన వారు ఎందుకు ఇలా చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి పెంచుతుంది. మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

కాగా, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ఈ మద్య క్రైమ్, హర్రర్, థ్రిలర్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.  కంటెంట్ బాగుండాలే కానీ సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లు సాగుతున్నాయి.  శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి థ్రిల్లర్ సినిమా చేస్తుండడం విశేషం. తమిళ హీరో శ్రీరామ్ ముఖ్యపాత్రలో నటించారు. మాటలు : కృష్ణభగవాన్, సంగీతం : రఘుకుంచె, లిరిక్స్ : భాస్కరభట్ల, శ్రీమణి, కెమెరా : అంజి, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : చిన్నా.  ఈ మూవీకి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: