పురుచ్చితలైవి.. ది గ్రేట్
ఐరన్ లేడీ
జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళం-తెలుగు-
హిందీ భాషల్లో మూడు బయోపిక్ లు తెరపైకి రాబోతున్నాయి. అందులో ఒకటి వెబ్ సిరీస్. రమ్యకృష్ణ
జయలలిత పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు
గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుండగా మిగతా రెండు సినిమాలు నిర్మాణ దశలో వున్నాయి.
ఒకటి
నిత్యామీనన్ నటిస్తున్న ది
ఐరన్ లేడీ. ఇంకొకటి
కంగన రనౌత్ నటిస్తున్న తలైవి.
నిత్యా నటిస్తున్న ది
ఐరన్ లేడీ సినిమాని
ప్రియదర్శిని తెరకెక్కిస్తుండగా..తెలుగు-తమిళ-
హిందీ భాషల్లో రూపొందుతున్న
తలైవి సినిమాని ఏఎల్
విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్నట్లు చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. ఇక
తలైవి సినిమా కోసం
కంగన భరతనాట్యం కూడా నేర్చుకుంటోంది. ప్రత్యేకంగా
జయలలిత మేనరిజమ్స్.. నడిచే తీరు.. హావ భావాల్ని వంటబట్టించుకుటోంది. అంతేకాదు
కంగన అమ్మ పాత్రని ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని విపరీతంగా శ్రమిస్తోంది.
అయితే జయలలితపై నిర్మాణంలో వున్న పోటీ బయోపిక్ లపై ఇటీవల
నిత్యామీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాకు ఎవరూ పోటీ కాలేరు! అనే అర్థంలో
నిత్యా చేసిన కామెంట్స్ ఫుల్ గా బర్న్ అయ్యాయి. అయితే ఏమైందో ఏమో గా ని ఇంతలోనే
నిత్యా మాట మార్చడం మరోసారి చర్చకు దారితీసింది. ఈ
జయలలిత బయోపిక్ విషయంలో నేను ఎవరితోనూ పోటీపడటం లేదని.. ఈ సినిమాని ఈ సమయంలోనే పూర్తి చేయాలనే నియమనిబంధనలేవీ నేను.. దర్శకురాలు
ప్రియదర్శిని పెట్టుకోలేదని
నిత్యా తాజాగా వెల్లడించింది. అంతేకాదు 'కంగనతో పోటీనా ఆ మాట నేను అనలేదే' అంటోంది. అయితే క్వీన్ రెబలిజానికి భయపడే ఇలా
నిత్యా మాట మార్చిందా? అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.