పవర్ స్టార్  పవన్ కళ్యాణ్... ఈ పేరుకు టాలీవుడ్ లో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. అయితే టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ రాజకీయాల్లోకి ప్రవేశించారు పవన్ కళ్యాణ్ .జనసేన పార్టీని స్థాపించారు.  అయితే రాజకీయాల్లో ఎంతో ప్రభావితం చేయాలని అనుకున్నపటికి ... ఘోర పరాజయాన్ని చవిచూసారు పవన్ కళ్యాణ్.  దీంతో  పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తారని అంతా అనుకున్నారు.కానీ  పవన్ కళ్యాణ్ జీవితం జనసేవ  కి అంకితం అంటూ పవన్  పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు సినిమాలో  పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు అంటూ  వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమా రీమేక్ లో  అమితాబచ్చన్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించ నున్నట్లు సమాచారం . ఈ సినిమా కోసం బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సినిమా కి సంబందించిన  ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 



 అయితే తాజాగా లాంగ్ మార్చ్ నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సినిమాల్లోకి తన రి ఏంట్రీ పై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. నటన గురించి ఇంకా ఏం ఆలోచించలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు . దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా  లేదా అనేది సందేహంగా మారింది. ఓవైపు బోనికపూర్ దిల్ రాజు పవన్  సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే... పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో  అందరూ షాక్ అవుతున్నారు . సినిమా నిర్మాణం అయితే చేస్తాను కానీ నటన గురించి ఇప్పట్లో ఆలోచన లేదు అంటూ పవన్ తేల్చిచెప్పేశాడు. ఈ నేపథ్యంలో పింక్  సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకున్న నిర్మాతల పరిస్థితి ఏంటి అని అందరూ భావిస్తున్నారు. 



 అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అటు  పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు... పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాను తెలిపిన విషయం తెలిసింది. పింక్ మూవీ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించ  బోతున్నాడని అభిమానులందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా తాను సినిమా నిర్మాణం చేపడతాను  కానీ నటన వైపు ఆలోచన లేదని చెప్పడంతో మళ్లీ అభిమానుల్లో పవన్ సినిమాలో నటించబోతున్నాడా  లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: