టాలీవుడ్ లో
నాని,
వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అల్లు అర్జున్..ఇలా యంగ్ హీరోస్ చాలామందే ఉన్నారు. కానీ అతి తక్కువ కాలంలో యూత్ ని బాగా అట్రాక్ట్ చేయడమే కాదు అదే యూత్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకున్న
హీరో మాత్రం
విజయ్ దేవరకొండ ఒక్కడే. 'అర్జున్ రెడ్డి'.. 'గీత గోవిందం' సినిమాలు
విజయ్ క్రేజ్ ను విపరీతంగా పెంచాయి.
విజయ్ స్టార్
హీరో అని.. నెక్స్ట్ లీగ్ కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ఈ మధ్య పరిస్థితి చూస్తుంటే మాత్రం ఆ క్రేజ్ చాలావరకు తగ్గుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
'టాక్సీవాలా' మంచి విజయం సాధించినప్పటికీ 'నోటా'.. 'డియర్ కామ్రేడ్' సినిమాలు
విజయ్ ని తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా 'డియర్ కామ్రేడ్' ఫ్లాప్ తర్వాత
విజయ్ దేవరకొండ పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడ కూడా అగ్రెసివ్ గా కనిపించడం లేదు. తన స్పీచ్ లలో ముందున్న జోష్ కూడా కనిపించడంలేదు. ఇక
విజయ్ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఏమాత్రం
విజయ్ హవా పనిచేయడం లేదని అర్థమవుతోంది.
విజయ్ ఫ్యాన్స్ నిజంగా ఈ సినిమాను చూసి ఉంటే ఖచ్చితంగా భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ రావాలి. కానీ ఈ
సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ చాలా యావరేజ్ గా ఉండటంతో
విజయ్ క్రేజ్ పడిపోయినట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో
విజయ్ నటించలేదు అన్న మాట నిజమే అనుకున్న కానీ ప్రమోషన్స్ మాత్రం గతంలో తన సినిమాలకు చేసినట్టే డిఫరెంట్ గా
ప్లాన్ చేశాడు. అయితే అవి కూడా రొటీన్ అయ్యాయని చాలామంది
విజయ్ ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు.
విజయ్ ప్రమోషన్స్ చేసినా ఈ
సినిమా మీద రిలీజ్ కు ముందు పెద్దగా క్రేజ్ రాలేదు. దీన్ని బట్టి
విజయ్ క్రేజ్ నెమ్మదిగా తగ్గుతోందని తెలుస్తోంది.
విజయ్ నటిస్తున్న నెక్స్ట్ సినిమాలు హిట్ అయితే ఓకే గానీ లేదంటే
విజయ్ మార్కెట్ కూడా తగ్గిపోయే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.