అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు విప్పి నిరసన చేపట్టి మెగా కుటుంబంపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై మరియు చిరంజీవి కుటుంబం పై దారుణమైన కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన శ్రీ రెడ్డి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి పై దారుణమైన కామెంట్ శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో చేసింది.


 శ్రీ రెడ్డి... చిరంజీవిపై చేసిన కామెంట్స్ ఒకసారి గమనిస్తే...“సారీ చిరంజీవి గారు.. నేను చాలా స్మూత్‌గానే మాట్లాడుతున్నా.. మంచి గురించి మాత్రమే మాట్లాడుతున్నా.. నా వ్యాఖ్యల్ని తీసుకోండి. మీకు పేరు ఉంది కాబట్టి మేమంతా వెధవలమా? వయసు కాదు జ్ఞానం ఉండాలి”, అంతేకాకుండా “ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్‌ని తొక్కి తొక్కి 13 హీరోస్‌ని కన్నారు. నన్ను కూడా తొక్కుతారా? నన్ను కెలకవద్దు. నా జోలికొస్తే పంబ పగిలి రంభ బయటకొస్తాది” అంటూ చిరంజీవి పై దారుణమైన కామెంట్స్ శ్రీ రెడ్డి చేసింది. అయితే శ్రీరెడ్డి ఇంతలా రెచ్చిపోవడానికి కారణం గమనిస్తే...ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బాగ్ బాస్ ఫినాలే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరు కావడం జరిగింది.


ఈ సందర్భంగా చిరంజీవి ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ తమన్నా సింహాద్రి గురించి మాట్లాడుతున్న సందర్భంలో పరోక్షంగా శ్రీ రెడ్డి పై వ్యాఖ్యలు చేయడంతో శ్రీ రెడ్డి తాజాగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పై విధంగా పోస్టులు పెట్టడం జరిగింది. విషయంలోకి వెళితే తమన్నా సింహాద్రి మరియు శ్రీ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు దారుణంగా చేయటంతో తమన్నా సింహాద్రి...శ్రీ రెడ్డి తో తనకున్న స్నేహాన్ని కట్ చేసుకోవడం జరిగింది. దీంతో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని చిరంజీవి తమన్నా సింహాద్రి పై పొగడ్తల వర్షం బాగ్ బాస్ ఫినాలే కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో చేయడంతో...శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో తనదైన శైలిలో చిరంజీవిపై కౌంటర్లు వేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: