ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మళ్లీ పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్ చేశారు. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ గురించి మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతూ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేసిన కత్తి మహేష్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో కాంప్రమైజ్ అయ్యి సైలెంట్ అయిపోయారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫార్మ్ హౌస్ లో ఏం చేస్తారో మాకు తెలియదా నువ్వు నీ వేషాలు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అంటూ పచ్చి పచ్చిగా మీడియా ముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై విమర్శలు చేసిన కత్తి మహేష్ తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చాలా దారుణంగా విమర్శలు చేశారు.


విషయంలోకి వెళితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెడుతుందని ప్రభుత్వం పై నిరసన చేపట్టిన విషయం మనకందరికీ తెలిసినదే. అయితే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన విశాఖ పట్టణం లో గాజువాక నియోజకవర్గం లో ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో సమావేశం అయిన సందర్భంలో ఏటీఎం ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి పులివెందులలో రాజధానిని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు. అయితే పవన్ చేసిన ఈ సలహా కత్తి మహేష్ కి ఆగ్రహం తెప్పించినట్లుంది.


ఈమేరకు పవన్ కళ్యాణ్ ని తిడుతూ… ”ఏరా పవన్ కళ్యాణ్. పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!” అని ఆయన ఫేస్‌బుక్‌లో కత్తి మహేష్ ఒక పోస్టు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు కత్తి మహేష్ చేసిన కామెంట్లను తప్పు పడుతూ కత్తి మహేష్ పై విమర్శల వర్షం సోషల్ మీడియాలో కురిపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: