ఈ మధ్య కాలంలో టాలీవుడ్ అభిమానులకు తెరపైన బాగా నచ్చిన జోడి ఎవరంటే అది కేవలం రష్మిక మందన్న విజయ్ దేవరకొండ నే. గీత గోవిందం సినిమాలో వాళ్ళు చేసిన రొమాన్స్ ప్రేక్షకుల మనసులను పులకరింపచేసింది. భార్య భర్తలంటే ఇలా ఉండాలని ప్రతిఒక్కరిని ఆలోచించేలా మ్యాజిక్ చేసారు రష్మిక విజయ్. ఇక డియర్ కామ్రేడ్ సినిమాలో వీళ్ళు చేసిన కన్నులవిందైన కెమిస్ట్రీ అందర్నీ కట్టిపడేసింది. ఇలా వాళ్ళ అందంతో చూడచక్కనైన కెమిస్ట్రీతో సినీ అభిమానుల హృదయాలలో ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. 

 

 
మళ్ళీ..ఇంకో సినిమా ని రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కలిసి చేస్తే బాగుండు అని కోరుకునే వాళ్ళు కోకొల్లలు. ఆశ్చర్యమేంటంటే ఆ కోరుకునే వాళ్లలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కూడా ఉన్నారు. అవునండి! విజయ్ దేవరకొండ రాసే సోషల్ మీడియా పోస్టులను వాటికి స్పందించే రష్మిక రిప్లై లను చదివితే మీకే స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

 
ఇపుడు అసలు విషయానికి వద్దాం... అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ తన ఇంస్టాగ్రామ్ లో ఎలా పోస్ట్ షేర్ చేసారంటే... "రోజంతా మీ ధ్యాసే. మిమల్ని బాగా మిస్ అవుతున్న. నేను మిమల్ని మిస్ అవుతున్నానని మీకు తేలియాలనుకుంటున్న" అంటూ రష్మిక మందన్న ని డియర్ కామ్రేడ్ టీమ్ ని ట్యాగ్ చేసారు. 

 

 
ఇది చూసిన రష్మిక స్పందిస్తూ "ఆహా " అంటూ ఓ స్మైలీ ని పెట్టి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో విజయ్ పోస్ట్ ని షేర్ చేసింది. ఇక ఇది చూసిన తమ అభిమానులు దీని గురించి తెగ చర్చించుకుంటున్నారు. నిజమే మరి! వాళ్ళు మధ్య స్నేహం రోజు రోజుకి పెరిగి పోతుందనడానికి ఈ పోస్ట్ యే నిదర్శనం అని తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: