చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న మూవీకి సంబంధించిన పనులు వేగాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘సైరా’
మూవీ ఇచ్చిన ఫలితంతో
కొరటాల ప్రాజెక్ట్ విషయంలో
చిరంజీవి చాల పొదుపు చర్యలు పాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోకాపేటలో చిరంజీవికి సంబంధించిన స్థలంలో ‘సైరా’ కోసం వేసిన సెట్స్ ను మార్చి
కొరటాల మూవీకి కాలని సెట్ గా మారుస్తున్నట్లు సమాచారం.
ఇదే కాలనీలో ఈమూవీ
హీరోయిన్ గా నటిస్తున్న
త్రిష ఇంటి సెట్ కూడ ఉంటుందని సమాచారం. ఈమూవీ కథ సింహాచలం ఆలయం చుట్టూ తిరిగే నేపధ్యంలో సింహాచలం గుడిని పోలిన ఒక భారీ సెట్ ను ‘అర్జున్’ మూవీలో
మీనాక్షి టెంపుల్ సెట్ మాదిరిగా
కొరటాల డిజైన్ చేయిస్తాను అని చెప్పినప్పుడు
చిరంజీవి అడ్డుతగిలి వేరే సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈమూవీ కోసం భారీ సెట్స్ వేయవద్దని
తెలంగాణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో ఉండే ఒక పురాతన ఆలయంలో సన్నివేశాలను షూట్ చేసి ఆతరువాత గ్రాఫిక్ వర్క్స్ లో ఆ ఆలయాన్ని చాల పెద్దదిగా చూపెడదాము అని
చిరంజీవి సలహాలు ఇస్తూ
కొరటాల స్పీడ్ కు బ్రేక్ వేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ మారుమూల ప్రాంతం కాబట్టి షూటింగ్ చేసుకోవడానికి జనంతో ఇబ్బందులు ఏమి ఉండవు అని చెపుతూ షూటింగ్ ను చాల రహస్యంగా ముగించవచ్చు అంటూ మెగా స్టార్ కొరటాలకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం లీక్ అవుతున్న ఈవార్తలను బట్టి ‘సైరా’ అనుభవాలతో బడ్జెట్ విషయంలో
చిరంజీవి తన లేటెస్ట్
మూవీ విషయంలో చాల జాగ్రత్తలతో వ్యవహరిస్తున్నాడనుకోవాలి. అయితే బడ్జెట్ విషయంలో మితిమీరిన జాగ్రత్తలు తీసుకుంటే
మూవీ క్వాలిటీ విషయంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చి అసలకే మోసం వస్తుంది అన్నఅభిప్రాయం కొరటాలకు ఉన్నా
చిరంజీవి వద్ద తన అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు..