‘పింక్’ రీమేక్ కు మాటలు రాసి ఇస్తాను అని త్రివిక్రమ్ ఇచ్చిన మాట తప్ప ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన వార్తలు అన్నీ యదార్దాలు కావని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ ప్రాజెక్ట్ విషయంలో ఒక్క అంగుళం కూడ ముందుకు జరగలేదనీ ఈ మూవీకి సంబంధించి హీరోయిన్స్ గా పూజా హెగ్డే నయనతార తమన్నాలలో ఎవరో ఒకరిని ఎంపిక చేయడానికి బోనీకపూర్ చేసిన రాయబారాల పై పవన్ తీవ్ర స్థాయిలో బోనీకపూర్ పై అసహనాన్ని వ్యక్తపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ మూవీ నిమిత్తం పారితోషికంగా అదేవిధంగా ఈ మూవీ బిజినెస్ లో వాటా రూపంగా తనకు 50 కోట్లు పారితోషికంగా రాబోతోంది అన్న వార్తలను పవన్ చాల సీరియస్ గా తీసుకున్నట్లు టాక్. తన కెరియర్ లో ఏ నిర్మాతను ఎప్పుడు పారితోషికం విషయంలో ఇబ్బంది పెట్టలేదనీ అలాంటి తన వ్యక్తిత్వం పై నెగిటివ్ ముద్ర వేస్తూ వచ్చిన ఈ భారీ పారితోషిక వార్తలను ఎందుకు ఖండించలేదు అని పవన్ బోనీకపూర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అంతేకాదు ‘పింక్’ కథ తనకు నచ్చింది అని చెప్పాను కానీ ఈ రీమేక్ లో నటిస్తానని తాను చెప్పలేదనీ కేవలం ఆలోచిస్తాను అని చెప్పిన మాటను ఆధారంగా చేసుకుని తాను ఈ మూవీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లు ఎందుకు అనవసరపు ప్రచారం చేస్తున్నారు అంటూ పవన్ బోనీకపూర్ దిల్ రాజ్ లకు కూడ క్లాస్ పీకినట్లు టాక్. ఈ పరిస్థితులు ఇలా ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీ కోసం ఒక సెట్ ను నిర్మించదానికి ఒక ఫ్లోర్ ను బుక్ చేసారు అన్న వార్తలు కూడ పవన్ దృష్టికి వెళ్ళి అసహనాన్ని కలిగించి నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ విషయాలు అన్నీ త్రివిక్రమ్ దృష్టి వరకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ కోసం ప్యారిస్ షూటింగ్ లో ఉన్న త్రివిక్రమ్ తాను తిరిగి వచ్చే దాకా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి లీకులు ఇవ్వద్దని ఈ మూవీ నిర్మాతలకు సంకేతాలు ఇప్పటికే పంపాడు అని టాక్. అంతేకాదు పవన్ మూడ్ ను చూసుకుని తాను వ్యక్తిగతంగా కలిసి పవన్ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఖంగారు పడద్దు అంటూ త్రివిక్రమ్ దిల్ రాజ్ కు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో ‘పింక్’ రీమేక్ ఒక అడుగు ముందుకు వచ్చి ఐదు అడుగులు వెనక్కు వెళ్ళే విధంగా మారింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: