అయితే ఈ
సంక్రాంతి వార్ లో
త్రివిక్రమ్ ఇప్పటివరకు ముందుకు దూసుకుపోతున్నాడు ఎప్పటికప్పుడు 'అల వైకుంఠాపురంలో'
సినిమా గురించి అప్ డేట్స్ ఇవ్వడమే కాకుండా ఈమూవీకి సంబధించిన రెండు పాటలు విడుదలచేసి ఆ రెండు పాటలు
యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంటే
త్రివిక్రమ్ ఆ రిజల్ట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అదే సంక్రాంతికి బరిలో ఉన్న 'సరిలేరు నీకెవ్వరూ'
మూవీ ప్రమోషన్ విషయంలో ఇప్పటి వరకు వెనకపడి ఉండటమే కాకుండా ఇప్పటి వరకు విడుదలైన ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ కు కేవలం యావరేజ్ మార్కులు పడుతున్న నేపధ్యంలో అనీల్ రావిపూడి విపరీతమైన టెన్షన్ పడుతున్నాడు అని టాక్.
ఇలాంటి పరిస్థితులలో ఈ మధ్య జరిగిన
దీపావళి పండుగ సందర్భంగా సుబ్బరాజు
వెన్నెల కిషోర్ ల మధ్య సంభాషణకు సంబంధించి విడుదల చేసిన వీడియోలోని మాటలు తనను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని
త్రివిక్రమ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పుడో విడుదలకాబోయే
సినిమా గురించి ఇప్పుడు హడావిడి ఏమిటి అన్నమాట తన పై సెటైర్ అన్న భావనలో
త్రివిక్రమ్ ఉండటమే కాకుండా ఆ వీడియో పై తన సన్నిహితుల మధ్య తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచినట్లు టాక్.
దీనితో
త్రివిక్రమ్ తో పోల్చుకుంటే చాల జూనియర్ అయిన అనీల్ రావిపూడి పోయిపోయి
త్రివిక్రమ్ ను ఎందుకు కెలికాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు
దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ తనకు నచ్చలేదు అని వస్తున్న వార్తలను చూసి కూడ అనీల్ రావిపూడి తీవ్ర అంతర్మధనానికి లోనవుతూ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి ఎలా ఒక పాజిటివ్ మ్యానియా తీసుకు రావాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నట్లు టాక్..