విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ రీతు వర్మ. అయితే ఆ సినిమా సక్సెస్ లో విజయ్ తో పాటుగా రీతు వర్మకు మార్కులు ఇవ్వాల్సిందే. తన మార్క్ నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీసినిమా హిట్టైనా సరే పెద్దగా ఛాన్సులు అందుకోలేదు. సుధీర్ వర్మ డైరక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన కేశవ సినిమా తర్వాత రీరు కనిపించనేలేదు.


లేటెస్ట్ గా రీరు వర్మకు ఓ క్రేజీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. యువ హీరో నాగ శౌర్యతో అమ్మడు జోడీ కట్టబోతుంది. ప్రస్తుతం అశ్వద్ధామ సినిమా చేస్తున్న నాగ శౌర్య త్వరలోనే సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రీరు వర్మని సెలెక్ట్ చేశారట.


సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రతిభ చాటిన సంతోష్ జాగర్లమూడి సెకండ్ ప్రాజెక్ట్ నాగ శౌర్యతో చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ శౌర్య, రీతు వర్మ జోడీ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో యువ హీరోల్లో నాగ శౌర్య లక్కీ గాయ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనోడితో సినిమా చేసిన హీరోయిన్స్ అంతా స్టార్ రేంజ్ అందుకుంటారు.


ప్రస్తుతం తెలుగులో సూపర్ బిజీ హీరోయిన్ అయిన రష్మిక మందన్నను ఛలో సినిమాతో ఇంట్రడ్యూస్ చేసింది నాగ శౌర్యనే. ఆ సినిమా తర్వాత అమ్మడి కెరియర్ గ్రాఫ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మరోసారి రష్మికతో నాగ శౌర్య నటించాలని అనుకున్నా అమ్మడి డేట్స్ ఖాళీలేవని అంటుందట. మరి రీతు వర్మకు అలాంటి హిట్టే పడి ఆమె కూడా బిజీ అవ్వాలని ఆశిద్దాం. యంగ్ టీం కాబట్టి ఈ సినిమా మినిమం గ్యారెంటీ మూవీ అవుతుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: