టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఓ వెలుగు వెలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న నేపథ్యంలో బీ టౌన్ పై కన్ను వేసిన రకుల్ దే దే ప్యార్ దే అనే సినిమాలో నటించి మంచి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో మంచి పేరు అలాగే క్రేజ్ దక్కించుకుంది. ఇదే క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో చేస్తున్న సినిమాలు సరైన విజయాలు దక్కించుకో కాకపోవడంపై సౌత్ వైపు ఆశలు వదులుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా తన దృష్టి మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఫోకస్ అంతా బాలీవుడ్ ఇండస్ట్రీపై రకుల్ ప్రీత్ సింగ్ పెట్టడంతో...తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఇంకా తన జీవితంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోతో ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తల గురించి స్పందించి...క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... ప్రస్తుతం నేనెవరితోనూ డేటింగ్ చేయడం లేదు. రానా నాకు క్లోజ్ ఫ్రెండ్.


మంచు లక్ష్మి కూడా నాకు స్నేహితురాలు. నేను, రానా, మంచు లక్ష్మి మేమంతా ఓ గ్యాంగ్. మా గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. నా ఇల్లు, రానా ఇల్లు పక్క పక్కనే అని రకుల్ తెలిపింది.  అంతేకాకుండా ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను...ఎవరితోనూ డేటింగ్ చేయటం లేదు ప్రేమించే సమయం కూడా లేదు అని తెలిపింది. అయినా సరే ప్రస్తుతం ఉన్న తరం కోరుకుంటున్న ప్రేమ నా దగ్గర లేదు అంటూ నేను ఎప్పుడో పాతకాలంలో పూట్టాల్సింది అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: