'పెళ్ళిచూపులు' ఇలాంటి తక్కువ బడ్జెట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ డాం సంపాదించాడు. 'అర్జున్ రెడ్డి' సినిమా తో వరుస ఆఫర్లు అవకాశాలు దక్కించుకున్న విజయ్ దేవరకొండ 'గీతాగోవిందం' లాంటి క్లాసికల్ హిట్టు కొట్టి అమ్మాయిల మనసు దోచుకున్నాడు. ఇక్కడ దాకా బాగానే ఉన్నా తర్వాత..విజయ్ దేవరకొండ నటించిన 'నోట', 'డియర్ కామ్రేడ్' సినిమాలు వరుసగా ఫ్లాపులు కావటంతో అదేవిధంగా ఇటీవల నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా నిర్మించి ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ డైలమాలో పడినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


కెరియర్ పరంగా సక్సెస్ జర్నీ సాగుతున్న తరుణంలో అనవసరంగా ఎక్స్పరిమెంట్లు చేయకూడదని అలాగే కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసే విషయంలో అన్నివిధాల ఆలోచించి సినిమా ఒప్పుకోవడానికి విజయ్ దేవరకొండ డిసైడ్ అయినట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాకి డైరెక్టర్ గా పని చేస్తుంది క్రాంతి మాధవ్. గతంలో రెండు హిట్టు సినిమాలు ఇచ్చిన క్రాంతి మాధవ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అలానే విజయ్ తో దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సినిమా అనౌన్స్ చేశాడు.


పూరి అనుభవం ఉన్న డైరెక్టర్ కావడంతో ఈ సినిమాతో హిట్ అందుకుంటానని విజయ్ నమ్మకంగా ఉన్నాడు. కాగా అర్జున్రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తన కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్లడంతో ఇప్పటిదాకా ఏ విధమైన ఆలోచన లేకుండా సినిమాలు ఒప్పుకున్న విజయ్ దేవరకొండ...తాజాగా చేసిన సినిమాలు నిర్మించిన సినిమాలు ఫ్లాపులు కావటంతో భవిష్యత్తులో చేయబోయే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఓకే చేయాలనే ఆలోచనకు విజయ్ దేవరకొండ వచ్చినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: