'బాహుబలి' వంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన సాహో సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో ప్రభాస్ తో పాటు ఆయన అభిమానులు కూడా చాలా నిరుత్సాహం చెందారు. సాహో సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దాదాపు రెండు సంవత్సరాలపాటు ఆ సినిమా కోసం ప్రభాస్ టైం కేటాయించి ఎన్నో ఆశలు పెట్టుకున్న సాహో సినిమా మొట్ట మొదటి షోకే ఫ్లాప్ టాక్ రావడంతో తీవ్రంగా ప్రభాస్ అభిమానులు నిరుత్సాహం చెందారు. దాదాపు రెండు సంవత్సరాలు ప్రభాస్ ఈ సినిమాకి కేటాయించడంతో బాధపడ్డారు.


సినిమా విడుదల కాకముందే విడుదలైన ట్రైలర్లు హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో సినిమా పై అంచనాలు పెరగటంతో తేడా సినిమా హాల్లో కూర్చున్నా తర్వాత సినిమాలో మేటర్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో సినిమా ఉండకపోవడంతో ప్రభాస్ అభిమానులు సాహో సినిమా డైరెక్ట్ చేసిన సుజిత్ పై బహిరంగంగానే సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఇదిలావుండగా ప్రస్తుతం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాని యు.వి.క్రియేషన్స్ తో పాటుగా కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ఇటీవల అమెరికాలో కూడా పూర్తయింది.


మధ్యలో 'సాహో' సినిమా విడుదల అవ్వటం సినిమా ఫ్లాప్ అవ్వడం తర్వాత ప్రభాస్ 'బాహుబలి' సినిమా యూనిట్ తో కలిసి లండన్ వెళ్లడం అక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం తో బ్రేక్ తీసుకున్న ప్రభాస్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో షెడ్యూల్ కి రెడీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోలో జరిగే షెడ్యూల్ కోసం సినిమా నిర్మాతలు సుమారు రూ.2 కోట్లకు పైగా ఈ సెట్ కోసం ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. రెండు రైలు పెట్టెల బోగీలు సెట్ లను అన్నపూర్ణ స్టూడియోలో వేశారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా కాబట్టి అప్పట్లో రైలు భోగీలు ఎలా ఉండేవో.. అదే విధంగా సెట్ వేశారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. దాదాపు పదకొండు రోజులపాటు షెడ్యూల్ జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: