పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ రీఎంట్రీ తాలూకు న్యూస్ ఇప్పటికే దాదాపుగా ఖరారు కావడంతో, ఆయన నటించబోయే సినిమా ఎలా ఉండబోతోంది, అలానే అందులో ఎవరెవరు అందులో నటిస్తున్నారు అనే దానిపై
పవన్ ఫ్యాన్స్ ఎంతో ఫోకస్ చేస్తున్నారు. దిల్ రాజు,
బోనీ కపూర్ సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మించనున్న ఈ
సినిమా, ఇటీవల
బాలీవుడ్ లో రిలీజ్ అయి, మంచి హిట్ అందుకున్న పింక్ సినిమాకు
రీమేక్ అనేది తెలిసిందే. ఇక ఈ సినిమాలో
అమితాబ్ పాత్రలో
పవన్ నటిస్తుండగా,
తాప్సి పాత్రలో నటించే నటి కోసం అన్వేషణ జరుగుతోందని సమాచారం.
అలానే నేడు పవన్ ప్రక్కన
హీరోయిన్ కూడా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఒక స్టార్
హీరోయిన్ పవర్ స్టార్ కు జోడిగా నటిస్తోంది అనే వార్తలు కొద్దిరోజులుగా హల్ చేస్తుండడంతో, ఆమె మరెవరో కాదు
అనుష్క శెట్టి అని నేడు ఒక వార్త బయటకు రావడం జరిగింది. అయితే ఈ
సినిమా కథను మాత్రం ఇంకా అనుష్కకు వినిపించలేదని, కానీ ఆమెను తీసుకోవాలని మాత్రం
సినిమా యూనిట్ ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. మరొక రెండు రోజుల్లో దర్శకుడు వేణు
శ్రీరామ్, అనుష్కను కలిసి కథను వినిపిస్తారని అంటున్నారు.
ఇక మరోవైపు ఈ సినిమాలోని కీలకమైన కోర్ట్ సీన్ తాలూకు భారీ సెట్టింగుని నిన్నటి నుండి సిద్ధం చేయడం మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఆ సెట్ మరికొద్దిరోజుల్లో సిద్ధం అవుతుందని, ఇక
పవన్ కూడా తన పొలిటికల్ పనులను చూసుకుని మరికొద్ది రోజుల్లో ఫ్రీ అవుతారని, అదే సమయంలో
సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు కూడా మొదలెడతారని అంటున్నారు. అలానే
పవన్ కూడా
సినిమా కోసం తన ఫిజిక్ ని బాగా ఫిట్ గా ఉండేందుకు కసరత్తులు కూడా మొదలెట్టనున్నారట. ఇకపోతే ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అన్ని కూడా
సినిమా ప్రారంభం నాడే ప్రకటించడం జరుగుతుందట......!!