త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "అల వైకుంఠపురములో". ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం ప్రమోషన్లలో దూసుకుపోతుంది. చాలా పకడ్బందీగా ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ సినిమాలోని రెండు పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.


ఈ సినిమాలోని సామజవరగమనా పాట యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది. అత్యధిక లైక్స్ సాధించుకున్న తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. మాస్ సాంగ్ అయిన రాములో రాములా పాట కూడా యూట్యూబ్ లో సెస్నేషన్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ హీరోయిన్ టబు లుక్ వచ్చేసింది.



టబు ఈ సినిమాలో అల్లు అర్జున్ కి అక్కగా నటిస్తుందట.టబు లైఫ్ లో ఆమెకు ఎదురైన ఇబ్బందిరమైన సంఘటనలను వాటిని బన్నీ ఎలా పరిష్కరించాడు అన్నదే ఈ సినిమా కథ అట. మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికి ఎన్నో ఎంటర్ టైనర్ లని అందించిన త్రివిక్రమ్ మరోసారి ఫ్యామిలీ సెంటిమెంట్ తో రాబోతున్నాడు.


ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: