మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరున్ సినిమాలో
ఆర్మీ మేజర్
అజయ్ కృష్ణ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
అజయ్ కృష్ణ పాత్రలో
మహేష్ బాబు మెప్పించినట్టు సమాచారం. ఈ సినిమాలో
ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు కాబట్టి బోర్డర్లో
ఆర్మీ జవానులు ఎలా పనిచేస్తారు.. వారి జీవన విధానం ఏంటి అన్నది
మహేష్ బాబు స్వయంగా తెలుసుకుకొని అక్కడే షూటింగ్ చేయాలనీ అనుకున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్లో షూటింగ్ పెట్టుకున్నారు.
ఆ సమయంలోనే
మహేష్ బాబు తన ప్రాణాలకు తెగించి మరీ కొన్ని సాహసాలు చేశాడు. కాశ్మీర్లో షూటింగ్ అంటే సాహసమే. ఉగ్రవాదులు ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో తెలియదు. ఇక సెలెబ్రిటీలు
కాశ్మీర్ కు వచ్చారు అంటే వారిని అపహరించేందుకు సిద్ధం అవుతుంటారు. ఇవన్నీ తట్టుకొని
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ ను
కాశ్మీర్ లో చేయడం అంటే మాములు విషయం కాదు.
ప్రాణాలకు తెగించి షూటింగ్ చేసినట్టే. అక్కడ షూటింగ్ చేయడం కోసం
మహేష్ బాబుకు బులెట్ ప్రూఫ్ జాకెట్, కారును వినియోగించారు. దానికి ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించింది. ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే షూటింగ్ చేసుకోవడానికి అనుమతి ఉన్నది. ఆ తరువాత షూటింగ్ చేయడం కుదరదు. భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆ సమయంలో మాత్రమే షూటింగ్ జరగాలి.
షూటింగ్ సమయం మించకుండా, జాగ్రత్తలు తీసుకుంటూ ఇచ్చిన సమయంలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. క్షణం కూడా వృధా చేయలేదు. అన్ని పక్కా
ప్లాన్ ప్రకారమే షూటింగ్ చేసుకున్నారు. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకొని
హైదరాబాద్ ప్రయాణమైనా మరుసటి రోజే కాశ్మీర్లో ఆంక్షలు విధించారు. ఒకవేళ షూటింగ్ ఆలస్యం అయివుంటే..
సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేసుకొని వెనక్కి రావాల్సి వచ్చేది.