టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.  ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటి వరకు కామెడీ సినిమాలతో తనదైన ముద్ర వేశారు అనీల్ రావిపూడి.  విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా రూపొందిన ‘ఎఫ్ 2 ’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత మహేష్ బాబుతో మరో కమర్షియల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీలో మహేష్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తుంది. దాదాపు 15ఏళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  అయితే దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి కొన్ని పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.  ఇక పోస్టర్లను బట్టి చూస్తుంటే..విజయశాంతి స్మైలీతో చాలా దర్జాగా కుర్చీపై కూర్చొని ఏదో ఆదేశిస్తున్నట్లు కనిపిస్తుంది.  అంటే ఈ మూవీలో ఆమె పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపిస్తున్నట్టుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నారట.

అయితే ఈ మూవీలో కొన్ని బర్డర్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.  ఈ మూవీలో క్లయిమాక్స్ పూనకాలు తెప్పించే విధంగా ఉండబోతుందని ఇటీవీల సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఫన్నీ వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది.  దిల్‌రాజు, రామబ్రహ్మం, మహేశ్‌బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు. ఏది ఏమైనా సరిలేరు నీకెవ్వరు మూవీతో మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: