టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. అనిల్ రావిపూడి ఇప్పటివరకు 4 సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2015 సంవత్సరంలో పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తరువాత అనిల్ దర్శకత్వం వహించిన సుప్ర్రీమ్, ఎఫ్ 2, రాజా ది గ్రేట్ సినిమాలు కూడా విజయం సాధించాయి. 
 
ప్రస్తుతం అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మహేశ్ బాబు, రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 2020 జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న అల... వైకుంఠపురములో సినిమా కూడా విడుదల కాబోతుంది. అల వైకుంఠపురములో సినిమా నుండి ఇప్పటికే ఎన్నో అప్ డేట్స్ వచ్చాయి. 
 
కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి మాత్రం ఎక్కువ అప్ డేట్స్ రాలేదు. ఇప్పటివరకు అల వైకుంఠపురములో సినిమా నుండి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ సరిలేరు నీకెవ్వరు అప్ డేట్స్ మాత్రం అంతగా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడి కొన్ని రోజుల క్రితం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రమోషన్స్ ఇప్పుడే ఎందుకనే విధంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. 
 
ఈ వీడియోలోని సంభాషణ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మీద సెటైర్ లా ఉందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అల వైకుంఠపురములో సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాకంటే ప్రమోషన్స్ విషయంలో ముందుందని పోటీగా విడుదల అవుతున్న సినిమాపై పరోక్షంగా కామెంట్లు చేయటం మంచిది కాదనే అభిప్రాయం సినీ పరిశీలకుల నుండి వ్యక్తమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: