సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రష్మిక మందన్న తొలిసారి కలిసి నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇప్పటికీ మూడొంతులు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక తన కెరీర్ లో తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమాలో అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్

మురళి శర్మ, హరితేజ, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఒకప్పుడు లేడీ అమితాబ్ గా పేరు పొందిన విజయశాంతి గారు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఇందులో ఆమె భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల దీపావళి సందర్భంగా రిలీజ్ అవ్వగా, నేడు సినిమాలోని రష్మిక లేటెస్ట్ లుక్ తాలూకు పిక్స్ లీక్ అయి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

ఆ ఫొటోల్లో రష్మిక ట్రెడిషనల్ డ్రెస్ అయిన రెడ్ కలర్ లంగావోణీ ధరించి ఎంతో అందంగా కనపడుతోంది. ఇక ఆ పిక్స్ ని చూసిన పలువురు నెటిజన్లు, రష్మిక అందానికి మెచ్చుకుంటూ, తప్పకుండా ఈ సరిలేరు సినిమా మంచి అవ్వాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని ఈ నెల రెండవ వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన అంచనాలున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: