సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు
రష్మిక మందన్న తొలిసారి కలిసి నటిస్తున్న తాజా
సినిమా సరిలేరు నీకెవ్వరు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇప్పటికీ మూడొంతులు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను
2020 సంక్రాంతి కానుకగా
జనవరి 12న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక తన కెరీర్ లో తొలిసారి
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమాలో
అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. రాజేంద్ర
ప్రసాద్,
ఆ ఫొటోల్లో
రష్మిక ట్రెడిషనల్ డ్రెస్ అయిన రెడ్ కలర్ లంగావోణీ ధరించి ఎంతో అందంగా కనపడుతోంది. ఇక ఆ పిక్స్ ని చూసిన పలువురు నెటిజన్లు,
రష్మిక అందానికి మెచ్చుకుంటూ, తప్పకుండా ఈ సరిలేరు
సినిమా మంచి అవ్వాలని కోరుకుంటూ తమ సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని ఈ నెల రెండవ వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు
టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం
టాలీవుడ్ లో విపరీతమైన అంచనాలున్న ఈ
సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర
సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!!