భాగమతి సినిమా తర్వాత అనుష్క తెరపై కనిపించి చాలా రోజులు అవుతుంది. మొన్న వచ్చిన చిరంజీవి సైరా సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించి అందరిని మెప్పించింది. ఇప్పుడు అనుష్క కథానాయకగా తెరకెక్కుతున్న చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలోనే దీపావళి పండుగా సందర్భంగా చిత్ర యూనిట్ మొన్న ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేసి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది చిత్ర యూనిట్. ఈ సంధర్బంగానే ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిశ్శబ్దం టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ టీజర్ ని విడుదల చేసేందుకు సీనియర్ ట్రేండింగ్ డైరెక్టర్స్ రానున్నారు. 


డైరెక్టర్ పూరి జగన్నాధ్, గౌతమ్ మీనన్, నీరజ్ పాండేలు ఈ సినిమ టీజర్ ని లాంచ్ చెయ్యనున్నారు. ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే, హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని అమెరికాలోని చిత్రీకరించారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం వహిస్తున్నారు. మరి ఈ సినిమా స్వీటీకి ఎంత సక్సెస్ ఇస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: