భాగమతి
సినిమా తర్వాత
అనుష్క తెరపై కనిపించి చాలా రోజులు అవుతుంది. మొన్న వచ్చిన
చిరంజీవి సైరా సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించి అందరిని మెప్పించింది. ఇప్పుడు
అనుష్క కథానాయకగా తెరకెక్కుతున్న చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రానికి
హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే
దీపావళి పండుగా సందర్భంగా చిత్ర యూనిట్ మొన్న ప్రీ టీజర్ విడుదల చేసి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది చిత్ర యూనిట్. ఈ సంధర్బంగానే ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిశ్శబ్దం టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ టీజర్ ని విడుదల చేసేందుకు సీనియర్ ట్రేండింగ్ డైరెక్టర్స్ రానున్నారు.