ఒకే ఒక్క రోజులో పెద్ద స్టార్ గా మారిన రణు మొండాల్‌ ,  ఆమె ఓ యాచకురాలు.. కానీ ఇప్పుడు ఆమె బాలీవుడ్‌ సెన్సేషన్‌. కోల్‌కతాలోని రానాఘట్‌ రైల్వేస్టేషన్‌లో లతా మంగేష్కర్‌ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది.

హిమేశ్‌ రష్మియా  ఆమె గాత్రానికి ఫిదా అయి ఆమేతో ఎలాగైనా  పాటలు పండించాలని నిర్ణయం తీసుకున్నారు, అనుకున్న విధంగానే  ఆమెతో  పాటలు పాడించి మంచి  పాపులారిటీని తెచ్చిపెట్టాడు. అయితే ఆమెకు ఇప్పుడు నెటిజన్లు గర్వం తలకెక్కిందని  తిట్టిపోస్తున్నారు. దీనికి ఆమె వ్యవహరించిన తీరే కారణనంగా మారింది . ఓ మహిళా అభిమాని రణుమొండాల్‌తో సెల్ఫీ దిగడానికి  తహతహలాడింది.


ఆ మహిళా అభిమాని ఎంతో  ప్రేమతో ఫొటో కావాలంటూ చేయితో తాకుతూ పిలిచింది. దీంతో రణు మొండాల్‌ ఆమెపై సీరియస్‌ అయింది. ‘నన్ను చేతితో తాకుతున్నావేంటి, టచ్‌ చేయకు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది.దింతో ఆ మహిళా అభిమాని బాధను అలాగే కోపాన్ని వ్యక్తం చేసింది . తన ఆటిట్యూట్‌ చూపించుతూ ఆమెను తోసేసింది. దీన్ని చూస్తున్న అభిమానులు చాల ఆశ్చర్యానికి గురైయ్యారు ,ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మరచి ఏ మాత్రం మనసులేని వారీగా ప్రవర్తించారు,  తన ప్రవర్తనని చుసిన నెటిజన్లు చాల కోపాన్ని వ్యక్తం చేసారు . 

అయితే, అభిమాని పట్ల రణు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చావో మళ్లీ అక్కడికే వెళ్లు అంటూ రణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్త పేరు రాగానే గర్వాన్ని నెత్తికెక్కిచ్చుకుని ఇలా ప్రవర్తించడం ఏమీ బాలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఏ విషయం సోషల్ మీడియాలో హల్ చల్  అవుతుంది.నెటిజన్లు  రణు మొండాల్‌ మార్పుని చూసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: