స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన గత సినిమాలైన డిజె మరియు నా పేరు సూర్య సినిమాలతో ప్రేక్షకులను మరియు ఫ్యాన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక ఆ తరువాత కొంత ఆలోచన చేసి, ఫైనల్ గా త్రివిక్రమ్ తో అలవైకుంఠపురములో సినిమాకు పచ్చ జెండా ఊపిన బన్నీ, ప్రస్తుతం ఆ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, అక్కినేని సుశాంత్, మురళి శర్మ, నివేత పేతురాజ్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అలానే రెండు లిరికల్ సాంగ్స్ కూడా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించి, గొప్ప రికార్డ్స్ ని నమోదు చేయడంతో పాటు, సినిమాపై ప్రేక్షకుల్లో అమాంతం అంచనాలు పెంచేసాయి. 

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి. అయితే రెండు రోజుల క్రితం ఈ సినిమా కథ ఇదే అంటూ ఒక కథ బయటకు వచ్చినప్పటి నుండి బన్నీ ఫ్యాన్స్ కొంత లోలోపల ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ప్రచారం అవుతున్న ఆ కథ ప్రకారం, గతంలో బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మాదిరిగా, ఇది కూడా తండ్రి, కొడుకుల అనుబంధాన్ని తెలిపే మంచి కథగా సాగుతుందట. అయితే అప్పట్లో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా బాగానే ఆడినప్పటికీ కూడా, 

బన్నీ ఫ్యాన్స్ ఆశించిన రేంజ్ విజయాన్ని మాత్రం ఆ సినిమా అందుకోలేదనే చెప్పాలి. సో, ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో కూడా అదే తరహా కథతో రూపొందుతుండడంతో, మళ్ళి తమ హీరో సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోయే ఛాన్స్ కనపడుతోందని, ఒక్కసారి చేసిన తప్పును బన్నీ మళ్ళి మళ్ళి చేస్తున్నారని కొంత ఆవేదన చెందుతున్నారట. అయితే దీనిపై కొందరు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, నిజానికి ప్రస్తుతం అలవైకుంఠపురములో సినిమా కథగా ప్రచారం అవుతున్న కథను పూర్తిగా విశ్వసించలేమని, రేపు సినిమా రిలీ అయి పూర్తి టాక్ బయటకు వచ్చే వరకు ఇవన్నీ నమ్మలేం అని, కాబట్టి దానిని నమ్మి బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవ్వవలసిన అవసరం లేదని అంటున్నారు. మరి రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో బన్నీ ఎంత మేర హిట్ కొడతాడో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: