ప్రస్తున్న సినీ పరిశ్రమలో స్టార్ హీరోల వారసులు హీరోలుగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో మెగా,అక్కినేని,దగ్గుబాటి, మంచు ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు వచ్చారు. ఇక
కోలీవుడ్ లో
సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు
ధనుష్ హీరోగా
వెండి తెరకు పరిచయం అయ్యాడు. తాజాగా ఇప్పుడు తెలుగు,
తమిళ భాషల్లో తనదైన ప్రత్యేకత చాటుకున్న చియాన్
విక్రమ్ తనయుడు
ధృవ్ హీరోగా వస్తున్నాడు. తెలుగు లో
సందీప్ వంగా దర్శకత్వంలో
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించిన ‘అర్జున్ రెడ్డి’
బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఈ
మూవీ రీమేక్ బాలీవుడ్ లో
సందీప్ వంగా దర్శకత్వంలో
షాహిద్ కపూర్, కైరా అద్వాని జంటగా ‘కబీర్ సింగ్’ గా తెరకెక్కించారు. అక్కడ కూడా
మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. తమిళంలో ఈ
మూవీ ‘ఆదిత్య వర్మ’గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో
ధృవ్ సరసన బనిత సంధూ నటిస్తుంది. ఈ
మూవీ మొదట
బాలా దర్శకత్వం వహించగా
సినిమా పూర్తి అయిన తర్వాత నిర్మాతలకు,
విక్రమ్ కి నచ్చకపోవడంతో పూర్తిగా రీ షూట్ చేశారట.
గిరీశాయ దర్శకత్వంలో ఈ
మూవీ తెరకెక్కించారు.
ధృవ్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు వున్నాయి. ఈ
సినిమా ప్రమోషన్స్ లో
ధృవ్ తో కలిసి
విక్రమ్ కూడా పాల్గొంటున్నారు. తొలి ప్రయత్నంలోనే
ధృవ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన వున్నాడు.
అర్జున్ రెడ్డి,
కబీర్ సింగ్ లా ఈ
మూవీ బ్లాక్ బస్టర్ సాధిస్తుందా లేదా హీరోగా
ధృవ్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి. గత కొంత కాలంగా
విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమాలు పెద్దగా హిట్ కావడం లేదు..మరి వారసుడి పరిస్థితి ఎలా చక్కదిద్దుతాడో చూడాలి.