ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 షో ఎట్టకేలకు ఎంతో ఆసక్తికరంగా ముగిసిన విషయం తెలిసిందే. మొదటగా 15 మందితో ఆరంభమయిన ఈ షోకు తొలి రోజుల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, తన ఆకట్టుకునే హోస్టింగ్ టాలెంట్ తో మెల్లగా షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ వచ్చారు. ఇక షోలో పార్టిసిపెంట్స్ తో పాటు, బిగ్ బాస్ సైతం ఆసక్తికరమైన టాస్కులు అందించడంతో మెల్లగా షో సక్సెస్ బాట పట్టింది. 

ఇకపోతే ఫైనల్ రోజున మిగిలిన ఐదుగురిలో శ్రీముఖి రన్నరప్ గా నిలవగా రాహుల్ సిప్లిగంజ్ విజేతగా ఎంపికయ్యాడు. అయితే మొదటి నుండి ఎంతో జాగ్రత్తగా ఆడుతూ వస్తున్న బాబా భాస్కర్ చివరి రోజున ఎలిమినేట్ అవడం జరిగింది. అయితే హౌస్ లోని పార్టిసిపెంట్స్ లో ఎక్కువమంది బాబా భాస్కర్ గురించి మాత్రం పాజిటివ్ గా చెప్పడం విశేషం. ఇక ఫైనల్ జరిగే రోజున షోకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, షో పై ప్రేక్షకుల్లో మరింత జోష్ ని నింపారు. ఇక షో మధ్యలో కాసేపు చిరంజీవి గారు తనతో మాట్లాడారని, నువ్వు ఎప్పుడూ బయట ఎంతో కోపంగా ఉంటావు, 

కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం నీ పంథా మార్చుకుని ఎంతో సౌమ్యంగా వ్యవహరించి, అందరిమనసులు గెలుచోవడంలో సక్సెస్ అయ్యావు, ఇకపై నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి బాబా అని ఆయన అన్నారట. అంతేకాక తన తదుపరి సినిమాలోని ఒక సాంగ్ కు నువ్వు కొరియోగ్రఫీ అందించాలి అని చెప్పడంతో బాబా భాస్కర్ ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడట. అయితే ఈ సంచలన విషయాన్ని నిన్న ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయటపెట్టిన బాబా భాస్కర్, ఈ జరిగిన ఘటన మొత్తాన్ని షోలో చూపించలేదని అన్నారు.......!!


మరింత సమాచారం తెలుసుకోండి: