ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క సక్సస్ తో వచ్చే క్రేజే వేరు. గత సినిమాలు మిక్సీలో వేసి రుబ్బి సినిమాలు తీసినా..బయోపిక్స్ అంటు అద్బుతంగా ప్రతిసారీ కళాఖండాలు తీసినా.. పాత సినిమాల సీక్వెల్స్ తీసినా అవి హిట్లయితేనే దర్శకులకు వరుసగా భారీ
సినిమా అవకాశాలు వస్తాయి. అదే గనక హీరోయిన్ల విషయానికి వస్తే ఒక్క హిట్ ఉంటే చాలు లక్కీ
హీరోయిన్ అంటు మిగతా విషయాలను లెక్కలోకి తీసుకోకుండా ఆఫర్లు వస్తాయని ఇండస్ట్రీలో అనుకుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని నభా నటేష్ విషయంలో అర్థమవుతోంది.
నభ నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. అయితే సుధీర్ బాబుతో నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాలో నభ నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో
పూరి అవకాశం ఇచ్చాడు. ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా..
రామ్ కు దీటుగా రఫ్ అండ్ బోల్డ్ గా నటించి ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ
సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఆ
సినిమా తర్వాత ఇప్పటివరకూ ఒక్క మంచి ఆఫర్ కూడా రాలేదట. స్టార్ హీరోలేమో నభను పట్టించుకోవడం లేదు. యంగ్ హీరోలేమో వాళ్ళ సినిమాలకు కొత్త హీరోయిన్లను ఎంచుకుంటున్నారట. దీంతో నభా పరిస్థితి ఎటు తేల్చుకోలేక డైలమాలో ఉందట.
అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే నభ తన రెమ్యూనరేషన్ కూడా కొంచెం ఎక్కువే డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఒక సినిమాకు నభ రూ. 50 లక్షలకు పైగా డిమాండ్ చేయడంతో ఆఫర్లు రాకపోవడానికి ఒక కారణమని చెప్పుకుంటున్నారు. మరి ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకపోతే ఇప్పటికి కనీసం ఓ రెండు సినిమల్లోనైనా కనిపించేదేమో. ప్రస్తుతం
రవితేజ 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పాయల్
రాజ్ పుత్ కూడా నటిస్తోంది. ఇది ఎప్పుడో ఒప్పుకున్న సినిమా. ఈ
సినిమా సంగతి పక్కన పెడితే.. ఇస్మార్ట్ హిట్ సాధించి కూడా ఆఫర్లు లేకపోవడం మాత్రం జాలిపడాల్సిన విషయం.