ఇప్పటికే
సంక్రాంతి బరిలో అల్లు అర్జున్-త్రివిక్రం కాంబినేషన్లో వస్తున్న
అల వైకుంఠపురములో,
అనిల్ రావిపూడి-సూపర్ స్టార్
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు పోటీ పడనున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాల మధ్యలో
సతీష్ వేగేష్న-కళ్యాణ్ రాం
సినిమా కూడా ఉండనే ఉంది. అయితే ఈ సినిమాలకు భారీ పోటీగా నిల్వనున్న
రజినీ కాంత్ 'దర్బార్' సినిమాకు సంబంధించి ఈ రోజు నుండి భారీగా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. నిన్నటి వరకూ ఈ
సినిమా ప్రమోషన్స్ ఎప్పటి నుండి మొదలవుతాయనే అనుమానాలకు పక్కాగా క్లారిటీ అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్.
ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో పక్కా మాస్ సినిమాగా తెరకెక్కుతున్న 'దర్బార్' కి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మోషన్
పోస్టర్ విడుదల చేయనున్నారు. అయితే ఈ మోషన్
పోస్టర్ ను సోషల్ మీడియాలో ముగ్గురు స్టార్ హీరోలు రిలీజ్ చేయబోతుండటం విశేషం. అంతేకాదు ఇలా మూడు ఇండస్ట్రీస్ కి సంబంధించిన ముగ్గురు స్టార్ హీరోస్ కలిసి మొదటిసారి రజనీ సినిమాకి ప్రమోషన్స్ లో పాల్గొనడం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అవుతోంది.
'దర్బార్'
హిందీ పోస్టర్ ని
బాలీవుడ్ స్టార్
హీరో కండల వీరుడు
సల్మాన్ ఖాన్ రిలీజ్ చేస్తుండగా మలయాళం కి సంబందించిన
పోస్టర్ ని
మోహన్ లాల్ రిలీజ్ చేస్తున్నారు. ఇక
తమిళ్ తెలుగుకి సంబంధించి లోకనాయకుడు
కమల్ హాసన్ రేపు సరిగ్గా అదే సమయానికి రిలీజ్ చేస్తారు. ఈ విషయాన్నీ లైకా సంస్థ సోషల్
మీడియా ద్వారా తెలియజేసి అనౌన్స్ చేసారు. సో ఈ రోజు నుండి మోషన్ పోస్టర్స్ తో
సూపర్ స్టార్ 'దర్బార్' సందడి మొదలవుతుంది. మరి ఈ మోషన్
పోస్టర్ తో
రజినీ ఫ్యాన్స్ ను ఎలా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే గతంలో రజనీ నుండి వచ్చిన కబాలి, కాలా, పేట సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. అందుకే ఈ
సినిమా సూపర్ హిట్టవ్వాలని రజనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.