వివాదాస్పద నటి శ్రీరెడ్డి పేరు చెబితే టాలీవుడ్‌లో ఛీ అని అసహ్యించుకునే వాళ్ళే చాలామంది ఉన్నారన్న సంగతి తెలిసిందే. అందుకు కారణం గతంలో తను చేసిన రచ్చే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరకాలంటే కొందరి కోరికలు తీర్చక తప్పదంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్ఠించింది. అప్పటికే ఎంతో మంది కోర్కెలు తీర్చనంటూ ఏమాత్రం బెరుకు లేకుండా ఓపెన్ గా చెప్పింది. అక్కడితో ఆగకుండా ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా కూర్చిని నానా రచ్చ చేసింది. ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద వాళ్లను ఇన్వాల్వ్ చేయడమే కాకుండా వాళ్ళని ఇష్టమొచ్చినట్టు ఏకేసింది. దీంతో ఇండస్ట్రీలో ఒక్క ఛాన్సిచ్చే వాళ్ళు లేకుండా చేసుకుంది. 

ఇక టాలీవుడ్‌లో అవకాశాలు రావని అనుకున్న శ్రీరెడ్డి మకాంను చెన్నైకి మార్చింది. అక్కడ కూడా పాపులారిటీ కోసం కొంత మంది స్టార్లపై బురదజల్లే ప్రయత్నం చేసింది. దీంతో ఈమెను అక్కడ కూడా ఛీకొట్టారు. ఇక చేసేదేమీ లేక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు, కామెంట్లు పెడుతూ అవకాశాలు కావాలని ఇన్‌డైరెక్ట్ గా అడుగుతుంది. అప్పుడప్పుడు అందాలు ఆరబోసే ఫ్యాషన్ షోలు కూడా చేస్తోంది. అయితే శ్రీరెడ్డికి టాలీవుడ్‌ సినిమాలో అవకాశం దక్కిందని తాజా సమాచారం.

నట కిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన 'డ్రీమ్' సినిమా దర్శకుడు భవాని శంకర్ ఒక కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తు్న్నారు. 'క్లైమాక్స్' అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో శ్రీరెడ్డికి ఒక కీలక పాత్ర ఇచ్చారట. ఈ సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, కమెడియన్ పృథ్వితో కలిసి శ్రీరెడ్డి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుందని మరో ఫ్రెష్ అప్‌డేట్. మర్డర్ మిస్టరీ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాతోనైనా శ్రీరెడ్డికి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి! 


మరింత సమాచారం తెలుసుకోండి: