నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో రూలర్ సినిమా చేస్తున్నాడు. బాలయ్య బాబు రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఈ సినిమాలో అదరగొడతాడని తెలుస్తుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే.


ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత అసలైతే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా చేయాల్సింది. కాని వినయ విధేయ రామ ఫ్లాప్ వల్ల బోయపాటి శ్రీనుతో సినిమా వాయిదా వేసుకున్నాడు బాలకృష్ణ. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమా రెడీ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.


అయితే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ మున్నా భాయ్ సంజయ్ దత్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మాములుగానే తన సినిమాలో విలన్లను ఓ రేంజ్ లో చూపించే బోయపాటి శ్రీను బాలయ్య కోసం సంజయ్ దత్ ను విలన్ గా చేయాలని ఫిక్స్ అయ్యాడు. సంజయ్ దత్ ప్రస్తుతం కె.జి.ఎఫ్ 2లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో అథిరా పాత్రలో సంజయ్ కనిపిస్తున్నాడు.  


మరి బాలకృష్ణ సినిమాకు సంజయ్ దత్ ఓకే చెబుతాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాకు సమ్నందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. సంజయ్ దత్ విలన్ అయితే కచ్చితంగా ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. మరి సంజయ్ దత్ లాంటి విలన్ ను పెడుతున్నాడు అంటే బోయపాటి ఆ పాత్రను ఏ రేంజ్ లో రాసుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ కాంబినేషన్ తెర మీద ఎలా ఉండబోతుందో అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: