ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత అసలైతే
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో
సినిమా చేయాల్సింది. కాని
వినయ విధేయ రామ ఫ్లాప్ వల్ల బోయపాటి శ్రీనుతో
సినిమా వాయిదా వేసుకున్నాడు బాలకృష్ణ. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ కాంబినేషన్ లో
సినిమా రెడీ అవుతుంది. త్వరలోనే ఈ
సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో విలన్ గా
బాలీవుడ్ మున్నా భాయ్
సంజయ్ దత్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మాములుగానే తన సినిమాలో విలన్లను ఓ రేంజ్ లో చూపించే బోయపాటి శ్రీను
బాలయ్య కోసం
సంజయ్ దత్ ను విలన్ గా చేయాలని ఫిక్స్ అయ్యాడు.
సంజయ్ దత్ ప్రస్తుతం కె.జి.ఎఫ్ 2లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో అథిరా పాత్రలో సంజయ్ కనిపిస్తున్నాడు.
మరి
బాలకృష్ణ సినిమాకు
సంజయ్ దత్ ఓకే చెబుతాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాకు సమ్నందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.
సంజయ్ దత్ విలన్ అయితే కచ్చితంగా ఆ
సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. మరి
సంజయ్ దత్ లాంటి విలన్ ను పెడుతున్నాడు అంటే బోయపాటి ఆ పాత్రను ఏ రేంజ్ లో రాసుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ కాంబినేషన్ తెర మీద ఎలా ఉండబోతుందో అని
నందమూరి ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.