మన సౌత్లో ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ మీద మోజుతో చేతిలో అవకాశాలు పొగొట్టుకున్నారు. ఇక్కడ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ లో సత్తా చాటాలనుకొని అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళ లిస్ట్ పెద్దదే. ఈ మధ్యకాలంలో
సౌత్ నుండి వెళ్ళి
బాలీవుడ్ లో సక్సస్ అయింది ఒక్క తాప్సీ మాత్రమే. అయితే తాజాగా
బాలీవుడ్ లో వెలగాలనుకుంటున్న రకుల్ మరో క్రేజీ ఆఫర్ను దక్కించుకుంది.
సౌత్లో స్టార్ హీరోయిన్గా మంచి ఫాంలో ఉండగానే
బాలీవుడ్ చెక్కేసింది రకుల్. అయితే సౌత్ సినిమాలను మాత్రం వదిలిపెట్టలేదు. తెలుగు సినిమాలు చేస్తూనే హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రకుల్ సక్సెస్ అయ్యింది మాత్రం వెంకటాద్రి ఎక్ప్రెస్ అనే తెలుగు సినిమాతోనే. తరువాత
తమిళ సినిమాలతోనూ స్టార్
హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో టాప్ హీరోలందరి సరసన నటించిన రకుల్, గత ఏడాది విడుదలైన అయ్యారే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ సినిమాహిట్ అవడంతో రకుల్ కి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. గ్లామర్ షో లో
బాలీవుడ్ హీరోయిన్స్ కు పోటి ఇవ్వటం కూడా రకుల్కు కలిసొచ్చింది.
అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన దే దే ప్యార్ దేలో రకుల్ చేసి బోల్డ్ క్యారెక్టర్ తో బాలీవుడ్లోనూ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. తాజాగా ఈ
భామ నటించిన
బాలీవుడ్ మూవీ మర్జావన్ ఈ శుక్రవారం రిలీజవుతోంది. ఇక రకుల్ మరో
బాలీవుడ్ మూవీ లో ఆఫర్ వచ్చినట్టుగా తాజా సమాచారం. ఇప్పటి వరకు రకుల్ బాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాల్లోనే నటించింది. మొదటిసారిగా సోలో హీరోయిన్గా ఈ సినిమాలో నటించబోతోందట.
మహిళా దర్శకురాలు కశ్వీ నాయర్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ
సినిమా లవ్ ఆజ్ కల్ తరహా
లవ్ స్టోరిగా తెరకెక్కనుందని
బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ సినిమాలో యంగ్
హీరో అర్జున్ కపూర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతోంది రకుల్. త్వరలో ఈ బ్యూటి తెలుగులో నితిన్,
చంద్ర శేఖర్ ఏలేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.