సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను మహర్షి లాంటి రెండు బ్లాక్ బస్టర్ వరుస విజయాలతో తన కెరీర్ని సక్సెస్ఫుల్ కెరియర్ గా అద్భుతంగా డ్రైవ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అనిల్ రావిపూడి దర్శకత్వం లో మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్టోరీ కలిగిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ తన అభిమానులకు ఇవ్వాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లు సమాచారం. మరోపక్క మహేష్ అభిమానులు కూడా ఈ సినిమాతో కచ్చితంగా మా సూపర్ స్టార్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. జనవరి 12వ తారీకున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా లో మహేష్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది.


అంతేకాకుండా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి దాదాపు 13 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. విజయశాంతి భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సెన్సేషనల్ డెసిషన్ కెరియర్ పరంగా తీసుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ గట్టిగా వినబడుతుంది.


విషయంలోకి వెళితే వరుస సక్సెస్ లు మీద ఉన్న మహేష్ సరిలేరు రిలీజ్ తరువాత దాదాపుగా మూడు నెలల లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నట్లు ఇటీవల ఆయన సతీమణి నమ్రత గారు ఒక పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. గతంలో ఖలేజా రిలీజ్ సమయంలో దాదాపుగా మూడేళ్లు బ్రేక్ తీసుకున్న సూపర్ స్టార్, ఆ తరువాత ఎప్పుడూ ఇంత లాంగ్ బ్రేక్ తీసుకోలేదని, అయితే ఆయన కొంత మానసికంగా, మరియు శారీరకంగా దృఢంగా అవడం కోసమే ఈ బ్రేక్ తీసుకుంటున్నట్లు మహేష్ భార్య నమ్రత పేర్కొన్నారు. దీంతో లేరు నీకెవ్వరు సినిమా విడుదలైన తర్వాత మళ్లీ వర్షాకాలానికి మహేష్ బాబు తన తర్వాత సినిమా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: