'నా పేరు సూర్య' లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరొక సినిమా చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ సమయంలో చాలా స్టోరీలు కూడా ఉన్నాడు. వరుస సక్సెస్ లు మీద ఉన్న అల్లు అర్జున్ కి నా పేరు సూర్య లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత ఏం చేయలేని స్థితిలో కి వెళ్లిపోయిన క్రమంలో తన తర్వాత సినిమా ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని తన సక్సెస్ కెరియర్ మళ్లీ కొనసాగాలని ఆశించిన బన్నీ ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్ల కథల విన్నాడు. అయితే చివరాకరికి తనకు రెండు సూపర్ డూపర్ లాంటి అదిరిపోయే హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన ‘అల వైకుంఠపురం లో’ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 12వ తారీకున విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లమెల్లగా మొదలుపెట్టిన సినిమా యూనిట్ త్వరలోనే భారీ ఎత్తున సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఓకే చేయకముందు అప్పట్లో బన్నీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ చిత్రం 'సోను కే టిటు కి స్వీటీ' రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినట్లు వార్తలు వచ్చాయి.


ఆ స్టోరీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అంటూ అల్లు అర్జున్ 'సోను కే టిటు కి స్వీటీ' రీమేక్ చేయడానికి రెడీ అయినట్లు అప్పట్లో ఫిలింనగర్లో వార్తలు వచ్చాయి. అయితే తర్వాత త్రివిక్రమ్ కథ చెప్పడంతో నచ్చడంతో 'సోను కే టిటు కి స్వీటీ' రీమేక్ ఆలోచన బన్నీ విరమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ సినిమా రీమేక్ కి రానా రెడీ అయినట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు రానా స్టార్ట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించాలి. ఇటువంటి నేపథ్యంలో రానా ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ ని కలిసినట్లు సమాచారం. దీంతో రానాతో ఈ సినిమాలో సెకండ్ హీరోగా  విశ్వక్ సేన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: