టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుసగా రెండు సూపర్ డూపర్ హిట్స్ అందుకుని ప్రస్తుతం మూడవ విజయం దక్కించుకోవడం కోసం ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఎంతో శ్రద్ధ పెడుతున్నారు.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా ద్వారా
విజయశాంతి టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండగా, ఆమెతో పాటు
కమెడియన్ బండ్ల గణేష్, మరొకటి నటి
సంగీత కూడా రీఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. ఇక ఇప్పటికే ఈ
సినిమా నుండి రిలీజ్ అయిన ఇంట్రో టీజర్ తో పాటు పలు పోస్టర్స్, సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెంచాయి.
మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, సుబ్బరాజు, వెన్నెలకిషోర్, రావురమేష్,
ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే నిన్నటి ఈ
సినిమా షూటింగ్ స్పాట్ లో నటి
విజయశాంతి గారు
మహేష్ బాబు కు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారట. అదేమిటంటే,
మహేష్ కు ఎంతో ఇష్టమైన వంటకాలను తెలుసుకుని మరీ, తన ఇంటి నుండి ప్రత్యేకంగా
విజయశాంతి వండించి తెప్పించారట.
ఇక ఆమె ఇచ్చిన అద్భుతమైన విందుతో
మహేష్ బాబుతో పాటు సరిలేరు
సినిమా యూనిట్ మొత్తం ఎంతో
ఖుషి అయిందట. ఇక ఎన్నో ఏళ్ల తరువాత ఈ
సినిమా ద్వారా తాను రీఎంట్రీ ఇస్తుండడం నిజంగా ఎంతో ఆనందంగా ఉందని, అలానే షూటింగ్ జరుగుతున్నంత సేపు తాను ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నానని
విజయశాంతి ఇటీవల తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.
సంక్రాంతి పండుగ కానుకగా
జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ
సినిమా ను
మహేష్, దిల్ రాజు,
అనిల్ సుంకర కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్నారు.....!!