మాస్ మహరాజ రవితేజ ‘బెంగాల్ టైగర్’ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.  అప్పట్లో మాస్ మహరాజ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేశాడని..అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడని రక రకాల పుకార్లు వెలుగు లోకి వచ్చాయి.  కానీ వాటన్నింటికీ చెక్ పెడతూ ‘రాజా ది గ్రేట్’ మూవీతో మాస్ మహరాజ ఈజ్ బ్యాక్ అనిపించాడు.  ఈ మూవీలో అంధుడిగా నటించినా..ఎక్కడా హీరోయిజం మిస్ అవకుండా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు రవితేజ. 

ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ లో ఆయన నటన బాగున్నా కంటెంట్ మిస్ కావడంతో వరుసగా మూడు సినిమాలు ఫెయిల్ అయ్యాయి.  తాజాగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ మూవీలో నటిస్తున్నాడు.  సైన్స్ ఫిక్షన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పూత్, నబా నటాష నటిస్తున్నారు. ఈ మూవీలో రవితేజ వృద్దుడిగా..యువకుడిగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారట. అయితే ఈ మూవీ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను- బలుపు సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

మరోసారి ఈ కాంబినేషన్ లో మూవీ అనగానే మాస్ మహరాజ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. అయితే ఈ మూవీపై ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తమిళంలో హిట్ అయిన ‘తేరి’ రిమేక్ అని వార్తలు రావడంతో డైరెక్టర్ మలినేని స్పందించారు. ఈ మూవీ రిమేక్ కాదని..తెలుగు రాష్ట్రాలకు సంబందించిన రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారాంగా చేసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నామని అన్నారు.  ఇది ఓ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినదని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి దర్శకుడు ఒక క్లారిటి ఇవ్వడంతో రవితేజ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: