బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. వారి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’ ‘లెజెండ్’ మూవీల మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి మరొకసారి వీరిద్దరూ కలవడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ మొదలు కాకుండానే క్రేజీ ప్రాజెక్ట్ గా మారిపోయింది. 

డిసెంబర్ 20న మొదలు కాబోతున్న ఈ మూవీని అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ రేస్ చివరిలో విడుదల చేయాలని బోయపాటి గెట్టి పట్టుదల పై ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్యతో పాటు బోయపాటి కూడ పరాజయాల బాటలో ఉన్న పరిస్థితులలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం వీరిద్దరికీ ఎంతో అవసరం. 

ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన విలన్ పాత్ర ఎంపికలో బోయపాటి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో హీరో పాత్రను మించి విలన్ పాత్రను ఎలివేట్ చేసే ఉద్దేశ్యంతో బోయపాటి బాలీవుడ్ ప్రముఖ నటుడు  సంజయ్ దత్ ను ఈ విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సంజయ్ దత్ ‘కేజీ ఎఫ్ 2’ లో విలన్ గా నటిస్తున్నాడు. 

దీనికితోడు ఎప్పటి నుంచో ఒక మంచి రోల్ దొరికితే తెలుగు సినిమాలలో నటించే ఆలోచనలు సంజయ్ దత్ చేస్తున్నాడు. ఈ విషయాలు అన్నీ బోయపాటి దృష్టికి రావడంతో ఈమధ్య బోయపాటి సంజయ్ దత్ ను కలిసి ఈ మూవీ కథను అందులోని అతడి పాత్రను వివరించినట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ కు ఈ కథ నచ్చినప్పటికీ తాను విలన్ గా నటించడానికి 3 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. అయితే బోయపాటి బాలయ్య సినిమాను తక్కువ బడ్జెట్ తో పూర్తి చేస్తాను అని మాట ఇచ్చిన నేపధ్యంలో అటు సంజయ్ దత్ ను వదులుకోలేక ఇటు మూవీ బడ్జెట్ పెంచలేక బోయపాటి తెగ టెన్షన్ పడిపోతున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: