సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ మొత్తంలో 2007లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమా రిలీజ్ తరువాత ఏకంగా మూడేళ్ళ భారీ గ్యాప్ తీసుకోవడం జరిగింది. సరిగ్గా మూడేళ్ళ తరువాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన ఖలేజా సినిమా రిలీజ్ అయింది. ఇక ఆ తరువాత దాదాపుగా పెద్దగా బ్రేకుల్లేకుండానే మహేష్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాల్లో నటించిన సూపర్ స్టార్, ఆ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కొట్టడంతో, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సరిలేరు నీకెవ్వరుతో ఎలాగైనా కెరీర్ లో తొలిసారి హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలని చూస్తున్నారు. 

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు పలు పోస్టర్లు, సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు పెంచడం జరిగింది. రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్, ఏకంగా మూడు నెలల పాటు లాంగ్ బ్రేక్ తీసుకోనున్నట్లు ఆయన భార్య నమ్రత, మొన్న ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు. అతిథి తరువాత మహేష్ తీసుకుంటున్న పెద్ద బ్రేక్ ఇదేనని, అయితే మహేష్, తనను తాను మరింత పూర్తిగా సంసిద్ధం చేసుకోవడానికి ఈ సమయం సరిపోతుందని ఆమె అన్నారు. కాగా, మహేష్ బ్రేక్ తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇటీవల మహర్షితో తనకు సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో మహేష్ మరొక సినిమా చేయనున్నారనే వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమేనని, ఈ సారి సూపర్ స్టార్ కోసం వంశీ, ఒక అద్భుతమైన కమర్షియల్ ఎంటర్టైనింగ్ స్టోరీ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ వంశీ ఎప్పుడో మహేష్ కు వినిపించారని, కాగా దాన్ని మరింత డెవలప్ చేయడానికి వంశీ కూడా టైం అడగడంతో, ఈలోపు తన బ్రేక్ టైం కూడా కలిసి వస్తుందని, ఆ తరువాత వంశీతో సినిమా చేయొచ్చని మహేష్ ప్లాన్ చేశారట. అయితే ఈ విషయం మహేష్ సన్నిహితుల ద్వారా ఇటీవల బయటకు వచ్చినప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉందని అంటున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: