మహేష్ బాబు టాలీవుడ్లో టాప్ హీరో.. అందులో సందేహం అవసరం లేదు.
మహేష్ బాబు సినిమాకు మంచి టాక్ వచ్చింది అంటే...
సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చెప్పక్కర్లేదు. బ్రహ్మోత్సవం,
స్పైడర్ వంటి ప్లాప్స్ తో సతమతమైన
మహేష్ కు
భరత్ అనే నేను,
మహర్షి సినిమాలు మంచి ఊరటను ఇచ్చాయి.
మహేష్ 25 వ సినిమాగా వచ్చిన
మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో
మహేష్ బాబు నటన అమోఘం. కెరీర్లో ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పోరాటం చేసిన మహేష్.. చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న తరువాత జరిగిన విషయాలు తెలుసుకొని ఫ్రెండ్ కోసం పోరాటం చేయడం సినిమాకు హైలైట్ గా నిలిచింది.
మహేష్ 25 వ సినిమాగా వచ్చిన ఈ
మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఈ
సినిమా తరువాత ఇప్పుడు
మహేష్ బాబు ఎంటర్టైనర్ దర్శకుడు
అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరూ
సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
సినిమా అంచనాలను మించేలా ఉన్నది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్కటిగా పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు.
ఈ పోస్టర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో మేజర్
అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. కాశ్మీర్లో జరిగిన షెడ్యూల్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఈ షెడ్యూల్ లో
మహేష్ బాబు తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. జమ్మూ కాశ్మీర్లో అప్పటికే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే.
సినిమా ఒక్కరోజు ఆలస్యం చేసినా
సినిమా షెడ్యూల్ ఆగిపోయేది. కానీ పక్కా ప్రణాళికతో షూటింగ్ చేశారు.