మహేష్ బాబు టాలీవుడ్లో టాప్ హీరో.. అందులో సందేహం అవసరం లేదు.  మహేష్ బాబు సినిమాకు మంచి టాక్ వచ్చింది అంటే... సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చెప్పక్కర్లేదు.  బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి ప్లాప్స్ తో సతమతమైన మహేష్ కు భరత్ అనే నేను, మహర్షి సినిమాలు మంచి ఊరటను ఇచ్చాయి.  మహేష్ 25 వ సినిమాగా వచ్చిన మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ఈ సినిమాలో మహేష్ బాబు నటన అమోఘం. కెరీర్లో ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పోరాటం చేసిన మహేష్.. చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న తరువాత జరిగిన విషయాలు తెలుసుకొని ఫ్రెండ్ కోసం పోరాటం చేయడం సినిమాకు హైలైట్ గా నిలిచింది.  


మహేష్ 25 వ సినిమాగా వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది.  ఈ సినిమా తరువాత ఇప్పుడు మహేష్ బాబు ఎంటర్టైనర్ దర్శకుడు అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సినిమా అంచనాలను మించేలా ఉన్నది.  ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్కటిగా పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు.  


ఈ పోస్టర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  ఇందులో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు.  కాశ్మీర్లో జరిగిన షెడ్యూల్ వెరీ స్పెషల్ అని చెప్పాలి.  ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు.  జమ్మూ కాశ్మీర్లో అప్పటికే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే.  సినిమా ఒక్కరోజు ఆలస్యం చేసినా సినిమా షెడ్యూల్ ఆగిపోయేది.  కానీ పక్కా ప్రణాళికతో షూటింగ్ చేశారు.  


ఇదిలా ఉంటె, మహేష్ బాబుకు ఓ లక్కీ ఛాన్స్ దక్కింది.  సౌత్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రజినీకాంత్ కొత్త సినిమా దర్బార్ కు సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు.  తెలుగు, తమిళ్ మోషన్ పోస్టర్ ను మొదట కమల్ హాసన్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి.  కానీ, తెలుగు మోషన్ పోస్టర్ ను కమల్ హాసన్ కాకుండా, మహేష్ బాబు రిలీజ్ చేస్తున్నారని వార్తలు రావడంతో మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: