ఒకప్పుడు మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న రోజులలో అతడికి తల్లిగా నటించిన విజయశాంతి చాల గ్యాప్ తరువాత మహేష్ తో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్న పరిస్థితులలో వీరిద్దరి మధ్య ఏర్పడిన బాంధవ్యం గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 

సుమారు 16 సంవత్సరాల తరువాత విజయశాంతి కెమెరా ముందుకు రావడంతో ఆమెకు ప్రస్తుతం ఫిలిం మేకింగ్ లో వచ్చిన మార్పులను మహేష్ ఆమెకు ఎంతో ఓపికగా వివరించడమే కాకుండా డైలాగ్స్ విషయంలో కూడ ఆమెకు ఎంతో సహకరిస్తున్నట్లు ఈ మూవీ షూటింగ్ ను చూసిన వారు చెపుతున్నారు. 

అంతేకాదు సెట్ లో మహేష్ ఆమెను చాల గౌరవంగా ‘అమ్మ’ అంటూ పిలవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ తన పట్ల చూపిస్తున్న ప్రేమకు పొంగిపోయిన విజయశాంతి ఈమధ్య అతడికి ఒక ఊహించని గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చినట్లు సమాచారం. 

మహేష్ ఇష్టపడే వంటలు అన్నీ విజయసాంతో నమ్రతకు ఫోన్ చేసి తెలుసుకుని ఆ వంటలను ప్రత్యేకంగా తన ఇంటిలో తయారు చేసి మహేష్ బాబు కోరుకునే ఇష్టమైన లంచ్ ని ఒకరోజు ఈ మూవీ సెట్ లో ఇచ్చి అతడికి షాక్ ఇచ్చిందట. అంతేకాదు మహేష్ కు ఇష్టమైన ఆ వంటలను ఆరోజు యూనిట్ లోని లైట్ బాయ్ దగ్గర నుండి సహాయకుల వరకు ఒకేరకం భోజనం అందరికీ ప్రేమతో వడ్డించిన విజయశాంతి మంచితనానికి ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఫ్లాట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి బంధం చూస్తున్న వారు మాత్రం వీరిద్దరి కాంబినేషన్ లో భవిష్యత్ లో మరిన్ని సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అందుకే కాబోలు దర్శకుడు అనీల్ రావిపూడి తాను తీయబోయే తరువాత సినిమాలో కూడ విజయశాంతిని నటించమని ఒత్తిడి చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: