తెలుగు చిత్రసీమలో మంచి నటన తో, వాక్చాతుర్యం తో ప్రేక్షకులను కట్టిపడేసిన మరియు రచయితగా, కవిగా ఇప్పటికి తన సేవలను తెలుగు సినిమా కు అందిస్తున్న విలక్షణ నటుడు గొల్లపూడి మారుతీ రావు గారు. తెలుగు పరిశ్రమలో అసలే ఈ మధ్య రోజులు అస్సలు బాగుండడం లేదు ఇటీవల మరణించిన సీనియర్ నటి గీతాంజలి మరణం ఇంకా కళ్ల ముందే మెదలాడుతుంది ఇక ఇప్పుడు అంతలోనే మరో సీనియర్ నటుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. ఆయనే గొల్లపూడి మారుతి రావు అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే మాత్రం వెంటనే అభిమానులలో ఆందోళన మొదలవుతుంది. ఇక సినిమా పరిశ్రమ వర్గాలు మాత్రం వణికిపోతున్నారు.
ఇటీవల మరణించిన వేణు మాధవ్, గుండు హనుమంత రావు, దర్శకుడు కోడి రామకృష్ణ, నటి సుజాత ఎలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మందిని డ్డూరం చేసుకున్న టాలీవుడ్ ఎప్పుడు నటనలో ఒకప్పుడు చక్రం తిప్పిన గొల్లపూడి మారుతీ రావు గారు నటుడు మాత్రమే కాకుండా రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్య నాయుడు గొల్లపూడి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వైద్యులతో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థుతుల గురించి వివరాలు కనుక్కున్నారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. అలాగే ఆయన రాసిన సాయంకాలమయింది చదివారని చాల నచ్చింది అని మీరు చెప్పినంత ఆచారాలు అర్ధం కాకపోయినా పెరిగిన విన్న వాతావరణాన్ని బట్టి విషయం అర్ధం చేసుకున్నానని అమ్మ ప్రేమని గొల్లపూడి మాటల్లో చదివితే, ఏడవకుండా ఉండటం ఎవ్వరివల్లా కాదు అని మంచి ఫీల్ ఉన్న ఒక మంచి నవల అని అతడి పొగుడుతూ చెప్పారు.
అలాగే అమ్మా నాన్నలకి దేశానికి దూరం అయిన వాళ్ళ అవసారాలని సమర్దిస్తూ, వెళ్ళిన వారి భాద్యతలు వివరించి చెప్పిన ఒక చక్కని కధ అని పొగడ్తలతో ఒక అభిమాని రాసారు అని దాన్ని చదివానని అని గుర్తుచేసుకున్నారు.