ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్బార్.. ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. కాగా ఇప్పటి నుండే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ నేడు విడుదల చేయనున్నారు.
ఇకపోతే తమిళ దర్బార్ మోషన్ పోస్టర్ ని లోకనాయకుడు కమల్ హాసన్ విడుదల చేస్తుండగా, తెలుగు దర్బార్ మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించనున్నారు.. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ నేటి సాయంత్రం 5:30 గంటలకు మహేష్ దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేస్తారని, అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడని తెలిసింది. అంతే కాకుండా ఇందులో సునీల్ శెట్టి ఓ కార్పొరేట్ దిగ్గజం పాత్రలో కనిపించబోతున్నాడని వినికిడి. ఇకపోతే 25 సంవత్సరాల క్రితం రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.
మరలా ఇప్పుడు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండటం విశేషం. ఇక దర్బార్ మోషన్ పోస్టర్ ను మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయబోతున్నారని ప్రకటించిన మురుగదాస్ తెలుగు, తమిళ మోషన్ పోస్టర్లను రిలీజ్ చేసే బాధ్యతను మాత్రం కమల్ హాసన్ మహేష్ బాబుకు అప్పగించాడు.
ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్తోపాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నయనతార, ప్రతీక్ బబ్బర్, నివేదా థామస్, దిలీప్ తాహిల్, నవాబ్ షా, గురు భుల్లార్, యోగిబాబు, శ్రీమన్, జతిన్ శర్మ, తదితరులు నటిస్తుండగా, అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీ పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి పోటీపడనుండటం విశేషం.