టాలీవుడ్ లో
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తర్వాత టాప్
హీరో మహేష్ బాబు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే 'అజ్ఞాత వాసి' తర్వాత
పవన్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లో బిజీ అవడంతో ప్రస్తుతం
టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉంది
మహేష్ బాబు మాత్రమే. ఆయన సినిమాకు గనక హిట్ టాక్ వచ్చిందంటే కలేక్షన్స్ ఏ రేంజ్ లో నమోదవుతాయో ఎవరు ఊహించలేరు. ఇక రీసెంట్గా
మహేష్ 25 వ సినిమాగా వచ్చిన
మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మరో సారి
సూపర్ స్టార్ స్టామినాని నిరూపించింది. ఒకరకంగా చెప్పాలంటే కమర్షియల్ ఫార్మాట్ కి దూరంగా చేసిన ఒక ప్రయోగమనే చెప్పాలి. ఇలాంటి ప్రయోగాలు తన తండ్రి
సూపర్ స్టార్ కృష్ణ నుండే
మహేష్ కి అలవడ్డాయి.
పోకిరి తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో మహర్షి.. కలెక్షన్స్ పరంగా రికార్డ్ బ్రేక్ మూవీగా నిలిచింది. ఇక ఈ
సినిమా తరువాత ప్రస్తుతం
మహేష్ బాబు
ఎఫ్-2 వంటి
బ్లాక్ బస్టర్ ని అందించిన దర్శకుడు
అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరూ'
సినిమా చేస్తున్నారు. ఈ
సినిమా మొదలైనప్పటినుంచే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంతేకాదు
అల్లు అర్జున్ నటిస్తున్న
అల వైకుంఠపురములో సినిమాతో
2020 సంక్రాంతి బరిలో పోటీగా నిలవబోతోంది. ఇక అల ఒకరకంగా ఆకట్టుకుంటుంటే
మహేష్ మాత్రం కేవలం పోస్టర్స్ తోనే ఆకట్టుకుంటు సినిమాపైన విపరీతమైన క్రేజ్ ని పెంచేస్తున్నాడు. ఈ సినిమాలో మేజర్
అజయ్ కృష్ణ గా అద్భుతమైన క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో
కాశ్మీర్ లో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది.