టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ మూవీతో రూ.200 క్లబ్ లో చేరారు. రైతు ఆత్మగౌరవం పై తీసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందింది.  కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ మూవీ పూర్తి కాగానే వెంటనే వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ మూవీలో నటించాడు మహేష్ బాబు.  ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. 
గత రెండు సంవత్సరాల నుంచి వరుస షూటింగ్‌లతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. 

ఇలా వరుస షూటింగ్‌లతో ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోయారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు గురించి ఆయన సతీమణి నమ్రత ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మహర్షి నుంచి నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇలా వరుస షూటింగ్‌లతో ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోయారు.  


గతంలో మహేష్ బాబు కి ఏ చిన్న సమయం దొరికినా..తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసేవారు. కానీ, మహర్షి మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి విరామం అన్నదే లేకుండా పోయిందట. ఇలా వరుస షూటింగ్‌లతో ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోయారట మహేష్ బాబు. ఈ నేపథ్యంలో లాంగ్ బ్రేక్ తీసుకోవాలనే నిర్ణయం తీసుకోవాలనుకొంటున్నారు అని నమ్రత తెలిపినట్లు సమాచారం.

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు మూడు నెలలపాటు బ్రేక్ తీసుకొంటారు. జనవరిలో సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తర్వాత పిల్లలు గౌతమ్, సితారకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నారు.  సరిలేరు నీకెవ్వరు తర్వాత కన్నడ దర్శకుడు, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేస్తారనే విషయం మీడియాలో ఓ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: