టాలీవుడ్ స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ ఒకరు.. రాజకుమారుడు సినిమా నుండి హీరోగా చేస్తున్న మహేష్ మహర్షి వరకు తన ఫ్యాన్స్ తో పాటుగా సిని ప్రియులను అలరిస్తున్నాడు. కెరియర్ లో 25 సినిమాలను పూర్తి చేసుకున్న మహేష్ ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు.


2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అనీల్ సుంకరసినిమా నిర్మిస్తుండగా మహేష్ కూడా సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు గాను మహేష్ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తుంది. 


మహేష్సినిమా కోసం ఏకంగా 53 కోట్లు పారితోషికం అందుకున్నాడట. అయితే తెలుగులో ఏ స్టార్ హీరో ఈ రేంజ్ లో పారితోషికం అందుకోలేదు. నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కన్నా మహేష్ బాబే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నాడని చెప్పొచ్చు. అంతేకాదు కేవలం తెలుగు సినిమాలే చేస్తున్న మహేష్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం కూడా హాట్ న్యూస్ అయ్యింది.


అయితే మహేష్ తీసుకునే రెమ్యునరేషన్ లో కొంత మొత్తం డైరెక్ట్ గా ఇస్తే మరికొంత మాత్రం ఏదైనా ఏరియా రైట్స్ రూపంలో ఇస్తున్నారట. మొత్తానికి అటు నిర్మాత నష్టపడకుండా హీరో ఇమేజ్ ను తగ్గించకుండా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ అయితే ఇక మహేష్ అన్ని సినిమాలకు 50 కోట్లు ఛార్జ్ చేస్తాడని చెప్పొచ్చు. సరిలేరు నీకెవ్వరు సినిమా టైం లో అనీల్ పనితనం చూసి మరో సినిమా ఛాన్స్ కూడా ఇస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సినిమా వెంటనే ఉంటుందా లేక కొద్దిగ్యాప్ తర్వాత సినిమా చేస్తాడేమో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: