తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3 ఇటీవల ముగిసింది. దాదాపు 17 మంది సభ్యులు టైటిల్ కోసం పోటీ పడిన ఈ రియాల్టీ షోలో చిట్టచివరిగా టైటిల్ సింగర్ రాహుల్ కి వరించింది. గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జున చేతుల మీదగా టైటిల్ ట్రోఫీ రాహుల్ అందుకున్నాడు. దీంతో టైటిల్ అందుకున్న నాటినుండి రాహుల్ పేరు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్ లో వరుసగా ఇంటర్వ్యూ ఇస్తూ హౌస్ లో జరిగిన అనేక విషయాల గురించి ప్రేక్షకులతో బయట ఉన్న అభిమానులతో పంచుకున్నారు.


ఇటువంటి నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ బిగ్ బాస్ తనకిచ్చిన రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి కంటెస్టంట్స్ కి వారి పాపులారిటీ బట్టి రెమ్యునరేషన్స్ ఫిక్స్ చేస్తుంది స్టార్ మా యాజమాన్యం. ఎలిమినేట్ అయినా అవ్వకపోయినా హౌస్ లో ఉన్నన్ని రోజులు కంటెస్టంట్లకు రెమ్యునరేషన్ ఇచ్చింది. కొంతమందికి రోజుకి ఇంత అని, మరికొంతమందికి వారం చొప్పున పారితోషికం చెల్లించారు. హౌస్ లో అందరికంటే శ్రీముఖికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్.


అయితే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా గెలిచిన రాహుల్ కి మాత్రం డైలీ పేమెంట్స్ లేవు. తనకు వారానికి ఓసారి డబ్బులు ఇచ్చేవారని.. అది కూడా చాలా తక్కువగా ఇచ్చారని అంటున్నాడు రాహుల్. షో కోసం తనకిచ్చిన పేమెంట్ పర్సనల్ అని బయట చెప్పకూడదని మాట్లాడుతూ...ఒకటి మాత్రం చెప్పగలను బయట తనకి లక్ష లో డబ్బులు వచ్చాయి అని తెగ వార్తలు వినబడుతున్నాయి వాటిలో వాస్తవం లేదని తనకు చాలా తక్కువ అమౌంట్ వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా వచ్చిన అమౌంట్ తో హైదరాబాదులో ఒక ఫ్లాట్ కొనే ఉద్దేశం ఉన్నట్లుగా రాహుల్ పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: