‘కె.జి.ఎఫ్’ సినిమా సౌత్ ఇండియా లో ఉన్న అన్ని ఇండస్ట్రీలలో సంచలన రికార్డులు సృష్టించి అద్భుతమైన కలెక్షన్లు సాధించి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు సౌత్ ఇండియా మొత్తం మారుమ్రోగిపోయింది. కాగా తాజాగా ప్రశాంత్ నీల్ త్వరలోనే మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాని నిర్మించేది కూడా ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’  సినిమా నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్…’సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ రన్నింగ్ లో ఉండగానే మహేష్ తో ‘కే జి ఎఫ్’ డైరెక్టర్ తీయబోయే సినిమా కి నిర్మాణ బాధ్యతలు తీసుకోవడానికి మహేష్ ని ఒప్పించినట్లు గా బలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.


అంతేకాకుండా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా మహేష్ కూడా ఉండబోతున్న టాక్ వినపడుతోంది. కాగా సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా అయిన వెంటనే మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో సమ్మర్ అయిన వెంటనే వర్షాకాలం జూన్ నెల నుండి కే జి ఎఫ్ డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


గత కొంత కాలం నుండి మహేష్ వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమ్మర్ మొత్తం తన ఫ్యామిలీతో గడిపి వచ్చే ఏడాది జూన్ నుండి ‘కే జి ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మహేష్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎక్కడ కూడా బయటికి రాలేదు కానీ సౌత్ ఇండస్ట్రీ లో చాలా గట్టిగా వినబడుతున్న న్యూస్ ‘కే జి ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్... మహేష్ తో త్వరలోనే సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: